/rtv/media/media_files/2025/06/03/HOj7rs5q8leJV6Andg3P.jpg)
Punjab Speaker Malik
మళ్ళీ తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదంటూ పాక్ ప్రభుత్వం ఒకపక్క కపట నాటకాలు ఆడుతూ ఉంటుంది. మరోవైపు అక్కడి నేతలు బహిరంగంగానే ఉగ్రవాద నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు మళ్ళీ మరో సారి పాక్ నేతలు, ఉగ్రవాదానికి లింక్ ఉందని మరోసారి బహిర్గతం అయింది. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తొయిబా ఉపాధ్యక్షుడు సైఫుల్లా కాసౌరితో పాకిస్థాన్ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ వేదిక పంచుకోవడం సంచలనంగా మారింది. అంతేకాదు కసూరిని అవమానించ వద్దని స్పీకర్ మాట్లాడ్డం కూడా వివాదాస్పదంగా మారింది.
Also Read : హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం
When speaker of Punjab assembly is an honor speaker of a terrorist organization & when these terrorists held such a huge event in the heart of Punjab, then what kind of proof the world needs to declare Pakistan a terrorist state?
— shahi sadat (@shahisadat) May 29, 2025
د پنجاب د اسمبلي سپيکر د ترهه ګرو په پروګرام کښې pic.twitter.com/CigOXbaqvE
Also Read : అసలైన ఇసైజ్ఞాని.. లయరాజు ఇళయరాజా బర్త్ డే స్పెషల్
భారత్ పై విజయం, ర్యాలీలు..
పాకిస్తాన్ లో ఉగ్రవాదులు వరుసపెట్టి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనికి పాక్ నేతలు హాజరవుతున్నారు. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ లో నిర్వహించిన ర్యాలీకి అక్కడి స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు. ఇది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి, లష్కరే తొయీబా ఉపాధ్యక్షుడు సైఫుల్లాహ్ కాసౌరి నిర్వహించాడు. దీంట్లో లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో స్పీకర్ మాలిక్ మాట్లాడుతూ...పహల్గాం దాడికి కూసరి నిందితుడు చేయడం తగదని...విచారణ పూర్తి కానంత వరకు అతనిని అనుమానించకూడదంటూ మాట్లాడారు. తాను కసూరీ ప్రాంతానికి చెందిన వాడినేనని అన్నారు.
మరోవైపు 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో తాము విజయం సాధించామని పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో సైఫుల్లా కసూరీని భారీ భద్రత మధ్య వేదిక మీదకు తీసుకువచ్చారు. అంతేకాదు అతనిపై అక్కడి వారు పూల వర్షం కూడా కురిపించారు. భారత్ తో పాటూ బంగ్లాదేశ్ గురించి కూడా లష్కరే ఉగ్రవాదులు గొప్పగా చెప్పుకున్నారు. షేక్ హసీనాను వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో తమ పాత్రను గుర్తుచేసుకున్నారు. హసీనా నుంచి దేశం నుంచి పారిపోయేలా చేసి.. భారత్లో ఆశ్రయం పొందేలా చేయడంలో తామము విజయం సాధించామని అన్నారు.
Also Read: IPL FINAL: ఐపీఎల్ కు కొత్త విజేత..ఎవరి కల తీరనుంది?
Also Read : పాకిస్తాన్కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
lashkar-e-taiba | today-latest-news-in-telugu | lashkar-e-taiba