Vemulawada : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గోశాలలో  కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు.

New Update
vemulawada

vemulawada

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గోశాలలో  కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు. రెండు రోజులుగా కోడెల ఆరోగ్యంపై చర్యలు తీసుకుంటున్నా మరణాలు మాత్రం ఆగడం లేదు. కాగా మరో 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వీటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఐదుగురు వైద్యులు, 12 మంది సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేసి కోడెలకు చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

Death Of A Heifer In Rajannagoshala

కాగా, శుక్రవారం ఒక్కరోజే 8 కోడెలు మృత్యువాత పడ్డాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో వాటిని ఖననం చేశారు. శ్రీ రాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను తిప్పాపూర్‌లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో తొక్కిసలాట జరిగి చనిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆలయ సిబ్బంది కూడా వాటి సంరక్షణను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం ఫలితంగా కొన్ని రోజులుగా రోజుకు 8 నుంచి 10 కోడెలు ప్రాణాలు వదులుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. చనిపోయిన కోడెలను ఖననం చేయటం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి.

Also Read :  అగ్రతారల ‘జూన్‌’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?

 వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించే కోడెల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.  ఒకప్పుడు కోడెలను అమ్మడం చేసేవారు. అయితే దేవాదాయశాఖలో కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తితో ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని ఉచితంగా వితరణ చేసే విధానం తీసుకొచ్చారు. అయితే గోశాలలు, రైతుల పేరు చెప్పి కొందరు అక్రమార్కులు ఎద్దులను చేజిక్కుంచుకుంటున్నారు. వారు వాటిని కబేళాలకు అమ్ముతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఈ విషయాలు గతంలో వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఈ పీరియడ్స్ సంకేతాలను విస్మరించవద్దు.. తీవ్రమైన సమస్యలు తప్పవు!

ఈ క్రమంలోనే కోడెల వితరణ నిలిపివేశారు. దీంతో  గోశాలలు పూర్తిగా నిండిపోయాయి. తిప్పాపూర్‌‌లో ఉన్న రాజన్న గోశాలలో 500 కోడెల సంరక్షణకు మాత్రమే అవకాశం ఉండగా... ప్రస్తుతం అక్కడ 1200పైగా కోడెలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కోడెల మృతిని ఆపాలంటే వితరణ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. నేటి నుంచి వితరణ మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభించనున్న కోడెల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్

మరోవైపు కోడెల పర్యవేక్షణకు తగినంత సిబ్బంది కూడా అందుబాటులో లేరు. దీనితో పాటు ఇటీవల కరుస్తున్న వర్షాలకు గోశాల మొత్తం రొచ్చుగా, బురద మయంగా మారింది. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని కోడెలకు ఇన్ఫెక్షన్‌లు కూడా సోకుతున్నాయి. మరోవైపు కోడెలతో గోశాల ప్రాంగణం కిక్కిరిసి పోవడంతో తొక్కిసలాట జరుగుతుంది. ఇవన్నీ కూడా కోడెల మరణాలకు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read :  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

 

rajanna-sirisilla | vemulawada-rajanna | rajanna-district | rajanna | cow | rajanna-sirisilla-district | vemulavada | vemulawada rajanna

Advertisment
Advertisment
తాజా కథనాలు