/rtv/media/media_files/2025/06/03/RuK8RRGYJtT6BGPx440k.jpg)
PBKS VS RCB
మొత్తం పది టీమ్ లు ఈసారి ఐపీఎల్ ఆడాయి. ఇందులో మొదటి నుంచి పంజాబ్ చాలా నిలకడగా ఆడుతూ వచ్చింది. ఇక బెంగళూరు విషయానికి వస్తే మొదట్లో అంత బాగా ఆడకపోయినా తరువాత పుంజుకుంది. వరుసపెట్టి మ్యాచ్ లను గెలిచి ఫైనల్ కు చేరుకుంది. రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టు సమవుజ్జీగా ఉన్నాయి. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ బలంగా ఉంది. మరోవైపు పంజాబ్ బ్యాటింగ్ లో బలంగా ఉన్నా బౌలింగ్ లో కాస్త వీక్ గా ఉంది. అయితే పంజాబ్ టీమ్ లోకి చాహల్ వస్తాడు అంటున్నారు. అతను కనుక వస్తే అదనపు బలం చేకూరుతుంది. ఇప్పటికే అర్షదీప్ ఉన్నాడు. ఇక ఆర్సీబీ టీమ్ లో బ్యటార్లలో కోహ్లీ, సాల్ట్ లు ప్రారంభాలు అదరగొడుతున్నారు. తరువాత వచ్చే వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య రూపంలో ప్రమాదకర ఓపెనర్లు ఆ జట్టు సొంతం. ఇక శ్రేయస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంకా నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్లతో పంజాబ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.
ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే ఇందులో మాత్రం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరే...ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ కన్నా బలంగా ఉన్నాడు. పైగా శ్రేయస్ కు జట్టును మూడు సార్లు ఫైనల్ కు తీసుకెళ్ళిన రికార్డ్ ఉంది. ఈ సారి ఐపీఎల్ లో కూడా శ్రేయస్ కెప్టెన్ గా దుళ్ళగొడుతున్నాడు. ఇక టోర్నీ పాయింట్ల విషయానికి వస్తే ఇరు జట్లూ 14 మ్యాచ్ లలో 19 పాయింట్లు సంపాదించారు. కానీ రన్ రేట్ పరంగా పంజాబ్ ముందుంది. అయితే క్వాలిఫయర్ 1 లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓడిపోయింది. ఇది బెంగళూరు జట్టుకు అదనపు విశ్వాన్ని ఇస్తుంది. మరోవైపు ఎలా అయినా కప్ ను గెలచి విరాట్ కు బహుమతిగా ఇవ్వాలని ఆర్సీబీ టీమ్ బలంగా అనుకుంటోంది.
Also Read : ప్రజల వద్దకే భూ పరిపాలన..నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
ఈసాలా కప్ నమ్దే అవుతుందా?
18 ఏళ్ళుగా బెంగళూరు, పంజాబ్ జట్లు రెండూ లీగ్ లో ఉన్నాయి. బెంగళూరు ప్రతీసారి ఈ సాలా కప్ నమ్దే అంటూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇది ఆ టజట్ుకు కలగానే మిగిలిపోయింది. మూడు సార్లు ఫైనల్ కు చేరుకున్నా చివర్లో ఫెయిల్ అయిపోయింది. అయితే ఈసారి ఆర్సీబీ కప్ ను వలదకూడదని పట్టుదలగా ఉంది. కప్ గెలిచి సీనియర్ ప్లేయర్ విరాట్ కు ఇవ్వాలని టీమ్ మేట్స్ బలంగా అనుకుంటున్నారు. ఎందుకంటే విరాట్ ఇప్పటికే టీ20, టెస్ట్ లకు గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ కూడా ఎన్నాళ్ళు ఆడతాడో తెలియదు. ఇప్పుడు ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలీదు, అప్పుడు విరాట్ ఉంటాడో లేడా కూడా తెలీదు. అందుకే ఈ సారి ఎలా అయినా కప్ గెలవాలని బెంగళూరు జట్టు పట్టుదలగా ఉంది. అభిమానులు కూడా ఇదే బలంగా కోరుకుంటున్నారు.
Also Read : వదిన తల నరికి.. చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తి
మొట్టమొదటిసారి నిలకడగా..
ఇక పంజాబ్ విషయానికి వస్తే 2014లో మాత్రమే ఈ టీమ్ ఫైనల్ కు వెళ్ళింది. మొత్తం అన్ని సీజన్లలో ఈ జట్టు నిలకడగా ఆడింది కూడా లాస్ట్ సీజన్, ఈ సీజన్ మాత్రమే. చాలా ఏళ్ళుగా ఫ్లే ఆఫ్స్ కు కూడా వచ్చింది లేదు. అయితే ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో లాగ్ దశలో రాణించడమే కాకుండా..ఫైనల్ కు కూడా చేరుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ వన్ లో ఉంది. ఇది ఈ జట్టుకు కలిసివచ్చే అంశం. క్వాలిఫయర్ 1 లో ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయింది అన్నది ఒక్కటి తప్పితే పంజాబ్ జట్టు అన్ని రకాలుగా బలంగానే ఉందని చెప్పాలి. ఈ మొత్తం సీజన్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆర్సీబీ, పీబీకేఎస్ మాత్రమే నిలకడగా ఆడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు జట్ల మధ్యనే తుది సమరం జరుగుతోంది. తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరం కోసం అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
Also Read: IPL Final: వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?
Also Read : ఐపీఎల్ ఫైనల్స్..కోహ్లీ 18 ఏళ్ళ కల నెరవేరుతుందా..
IPL 2025 | finals | match | today-latest-news-in-telugu | RCB vs PBKS