/rtv/media/media_files/2025/06/03/kSVAWYat7q8t2MhV6lho.jpg)
Bike accident
రోడ్డు మీద వెళ్తున్నప్పడు చావు ఏ రూపంలో వస్తందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి మన తప్పులేకున్నా రోడ్డు పక్కనుండి వెళ్తున్నా ఏ వాహనం రూపంలోనైనా మృత్యువు కబలించవచ్చు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిస్థితి కూడా అలాగే అయింది.రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆయనను పొట్టన పెట్టుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్ హైదరాబాద్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బైక్ మీద ఇంటికి వస్తుండగా హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.
Also Read : అగ్రతారల ‘జూన్’.. బడా హీరోలదే హవా - మొత్తం ఎన్ని సినిమాలంటే?
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
Bike Accident In Hyderabad
ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన చింతలపూడి సాయిమాధవ్.. గచ్చిబౌలిలో నివసిస్తూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 6.30గంటల ప్రాంతంలో సుజుకీ యాక్సె్స్(టీజీ 08కె2288)పై గచ్చిబౌలి నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శిల్పారామం వద్దకు రాగానే బైక్ అదుపుతప్పింది. దీంతో ఆయన కిందపడిపోయాడు.
ఇది కూడా చదవండి: ఈ పీరియడ్స్ సంకేతాలను విస్మరించవద్దు.. తీవ్రమైన సమస్యలు తప్పవు!
సాయి మాధవ్ తల అక్కడ ఉన్న డివైడర్కు తగిలి సాయిమాధవ్ తలకు తగిలింది. తీవ్ర గాయం కావడంతో గమనించిన స్థానికులు కొండాపూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిమాధవ్ మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై ఇసుక మెటలు పేరుకుపోవడమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్
Also Read : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
crime news | kondapur | bike | itech-city | hydrabad | telugu crime news | shilparamam