/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
Stock Market On Monday
సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. ఉదయం ప్రారంభం అయినప్పుడు లాభాల్లో ఉన్న సూచీలు తర్వాత చాలా తొందరగానే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా స్టాక్ మర్కెట్లు రైజింగ్ లోనే ఉన్నాయి. అయినా కూడా భారత్ మార్కెట్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. దీనికి కారణం వాణిజ్య ఆందోళనలే అని చెబుతున్నారు. వీటి కారణంగా సెన్సెక్స్ 150 పాయింట్లు పడిపోయిన తర్వాత 81,200 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయింది. ఇది ప్రస్తుతం 24,700 స్థాయి కంటే తక్కువగా ఉంది. మార్కెట్ 300 పాయింట్లకు పైగా పైకి ట్రేడవుతోంది.
సెన్సెక్స్ లో మెయిన్ స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, బజాజ్ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను చూస్తున్నాయి. ఎన్ఎస్యూ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 0.50% తగ్గింది. అదే సమయంలో మెటల్ ఇండెక్స్ 0.50% పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ కూడా 0.40% పెరిగింది. ఆటో, ఐటీ మరియు ఆయిల్ & గ్యాస్ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
జోరుగా పెరుగుతున్న ప్రపంచ మార్కెట్..
మరోవైపు ప్రపంచ మార్కెట్ జోరు మీదుంది. ఆసియా, అమెరికా మార్కెట్లు గ్రోత్ ను చూస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 80 పాయింట్లు పెరిగి 37,546 వద్ద ట్రేడవుతోంది. కొరియా కోస్పి స్వల్ప పెరుగుదలతో 2,698 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 322 పాయింట్లు పెరిగి 23,480 వద్ద ట్రేడవుతోంది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 15 పాయింట్లు పెరిగి 3,363 వద్ద ఉంది. అలాగే జూన్ 2న అమెరికా డౌ జోన్స్ 0.084% పెరిగి 42,305 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.67% పెరిగి 19,242 దగ్గర.. ఎస్&పి 500 ఇండెక్స్ 0.41% పెరిగి 19,242 వద్ద ముగిసింది.
Also Read: Ilayaraja: అసలైన ఇసైజ్ఞాని..లయరాజు ఇళయరాజా బర్త్ డే స్పెషల్