/rtv/media/media_files/2025/06/03/tL851ZAHoffnFoNc81WH.jpg)
RCB VS PBKS
అహ్మదాబాద్ లో ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. కానీ మెజారిటీ మాత్రం ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నారు. అందుకు కారణం విరాట్ కోహ్లీ. ఇప్పుడు మ్యాచ్ గెలిచి అతనికి కప్ ఇవ్వకపోతే ఇంకెప్పటికీ ఇవ్వలేము అన్న టాక్ ఉంది. ఈ ప్రెజర్ ఆ జట్టు మీద చాలా ఉంది. ఈ ప్రభావం మ్యాచ్ మీద కూడా కనిపించిందనే చెప్పాలి. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, కైల్ జామిసన్ చెరో మూడు వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశక్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
దూకుడుగా ఆడుతున్న పంజాబ్..
పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తప్ప ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. విరాట్ కూడా తన వికెట్ ను మంచి క్రూషియల్ టైమ్ లో పోగొట్టుకున్నాడు. తరువాత వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా పరుగులు సాధించారో అంతే తొందరగా వికెట్లు కూడా సమర్పించుకున్నారు. ఆర్సీబీ కనుక కాస్త సంయమనంతో ఆడి 210 ప్లస్ స్కోర్ చేసి ఉంటే కచ్చితంగా గెలిచేది. ఎందుకంటే అవతలి టీమ్ పంజాబ్ లో అందరూ మంచి బ్యాటర్లు ఉన్నారు. వాళ్ళకు ఇది పెద్ద ప్కోర్ కాకపోవచ్చును. ప్రస్తుతం పీబీకేఎస్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఇదే జోరు కంటిన్యూ చేశారంటే మాత్రం కచ్చితంగా టార్గెట్ ను ఈరజీగా ఛేదించేస్తారు. ఇప్పుడు మ్యాచ్ అంతా ఆర్సీబీ బౌలర్ల చేతిలో ఉంది. వాళ్ళు పరుగులను కట్టడి చేయాలి లేదా వికెట్లను తొందరగా తీయాలి. లేకపోతే పంజాబ్ బ్యాటర్లను ఆపడం కష్టం అవుతుంది.