/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
murder
TG Crime: తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన తిరుపతినాయక్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో ఇంట్లో తరుచుగా గొడవపడేవాడు. రోజు ఏదో విషయంలో కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఇదే క్రమంలో మూడు రోజుల కింద ఇంట్లో ఉన్న రూ. 10 వేలను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగొచ్చాడు. సోమవారం మధ్యాహ్నం పొలం వద్ద నుంచి ఇంటికి వచ్చి... మళ్లీ డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
Drunken Father Hit By Car
అయితే తన వద్ద డబ్బులు లేవని తల్లి చెప్పడంతో తిరుపతి నాయక్ ఆమెపై దాడికి దిగాడు. తల్లిని తండ్రి కొడుతుండడాన్ని గమనించిన కూతురు లావణ్య.. ఈ విషయాన్ని తన సోదరుడు రాజేశ్కు ఫోన్లో చెప్పింది. తను నడిపే కారుతో ఆవేశంగా ఇంటికి వచ్చిన రాజేశ్.. ఇంటి ముందు రోడ్డుపై నిలబడిన తండ్రి తిరుపతినాయక్ను కారుతో రెండు, మూడు సార్లు ఢీకొట్టాడు. దీంతో ఆయన కిందపడిపోయాడున దీన్ని గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ తిరుపతినాయక్ను 108లో వేములవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి అన్న రాములునాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజేశ్ ను అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Also Read : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్పై స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణ హత్య
crime news | accident | car | father | son | telugu crime news | crime news today | crime news telugu | crime news in telugu