🔴Live News Updates: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు. 

Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out
Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

 

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ట్రైన్‌లో మంటలు వ్యాపించాయి. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోయారు. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెనుక ఉన్న గార్డు గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ ట్రైన్‌ను నిలిపివేశారు. అనంతరం వెనుక బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీని కారణంగా ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

  • Jun 17, 2025 10:55 IST

    Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి

    ‘తల్లికి వందనం’ డబ్బులు రానివారికి ప్రభుత్వం మరోఛాన్స్ కల్పించింది. ఈనెల 20 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జూన్ 28లోపు అందిన ఫిర్యాదులను వెరిఫై చేసి.. జూన్ 30న అర్హుల కొత్త జాబితాను ప్రదర్శిస్తారు. జులై 5న డబ్బులు వేస్తారు.

    thalliki vandanam scheme money
    thalliki vandanam scheme money

     



  • Jun 17, 2025 10:12 IST

    AP DSC Exam 2025: ఏపీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు రిలీజ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోవచ్చు

    ఇప్పటికే జరిగిన ఏపీ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది. https://apdsc.apcfss.in/ ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

    ap dsc exams 2025  preliminary key released today
    ap dsc exams 2025 preliminary key released today

     



  • Jun 17, 2025 10:11 IST

    Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు సాయం చేసేందుకు ఓ వైద్యుడు ముందుకొచ్చారు. యూఏఈలో నివాసముంటున్న భారత వైద్యుడు డా.షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

    UAE-based Indian doctor donates Rs. 6 crore to  medics families
    UAE-based Indian doctor donates Rs. 6 crore to medics families

     



  • Jun 17, 2025 10:11 IST

    ICC Womens ODI World Cup 2025 Schedule: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ Vs పాక్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్

    మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి

    ICC Womens ODI World Cup 2025
    ICC Womens ODI World Cup 2025

     



  • Jun 17, 2025 07:51 IST

    Snake Video: పాముతో ఆటలు.. ముద్దుపెట్టబోయి మృత్యువు అంచుల్లో రైతు! (వీడియో)

    పాముకు ముద్దు పెట్టబోయిన ఓ రైతు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్‌ రీల్స్ కోసం పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అది నాలుకపై కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.

    UP man tries to kiss snake for reel, gets bitten
    UP man tries to kiss snake for reel, gets bitten

     



  • Jun 17, 2025 07:50 IST

    Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

    APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు. 

    Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out
    Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

     



  • Jun 17, 2025 07:15 IST

    Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!

    నిజామాబాద్‌ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

    daughter killed father in nizamabad district
    daughter killed father in nizamabad district

     



Advertisment
Advertisment
తాజా కథనాలు