/rtv/media/media_files/2025/06/17/3ggHjrMSkMTlBnrdKtWS.jpg)
ICC Womens ODI World Cup 2025
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఎడిషన్ పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్తాన్ తొలిసారిగా తలపడనున్నాయి.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
ICC Womens ODI World Cup 2025 Schedule
ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 31 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మొదటి మ్యాచ్లో ఆతిథ్య భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి.
The moment we’ve been waiting for! 🏆
— BCCI (@BCCI) June 16, 2025
The Women’s Cricket World Cup 2025 fixtures are OUT! 🗓🔥@ICC pic.twitter.com/qiAjB9arxI
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఈ టోర్నమెంట్ కోసం భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తుండటం వల్ల ఈ మ్యాచ్లను బెంగళూరు, వైజాగ్, ఇండోర్, గౌహతి, కొలంబో షెడ్యూల్ చేశారు. ఒక సెమీ-ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. మరొకటి కొలంబో లేదా గౌహతిలో జరుగుతుంది. ఫైనల్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ ట్రోర్నీలో పాకిస్తాన్ జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడుతుంది.
Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
ఎనిమిది జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో మిగిలిన జట్లను ఒకే రౌండ్-రాబిన్ పద్ధతిలో ఎదుర్కొంటారు. మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్కు చేరుకుంటాయి. సెప్టెంబర్ 24 నుండి రెండు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. వీటిలో కూడా అన్ని జట్లు పోటీపడనున్నాయి.
𝙈𝙖𝙧𝙠 𝙮𝙤𝙪𝙧 𝙘𝙖𝙡𝙚𝙣𝙙𝙖𝙧𝙨 🗓️#TeamIndia's fixtures for ICC Women's Cricket World Cup 2025 are here 🥳
— BCCI Women (@BCCIWomen) June 16, 2025
It all starts in Bengaluru on 30th September against Sri Lanka 🙌#CWC25 pic.twitter.com/DgCjMqa5O6