ICC Womens ODI World Cup 2025 Schedule: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ Vs పాక్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్

మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ తొలిసారిగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి

New Update
ICC Womens ODI World Cup 2025

ICC Womens ODI World Cup 2025

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంక వేదికలలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాకిస్తాన్ తొలిసారిగా తలపడనున్నాయి.  

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

ICC Womens ODI World Cup 2025 Schedule

ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 31 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. 

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఈ టోర్నమెంట్ కోసం భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తుండటం వల్ల ఈ మ్యాచ్‌లను బెంగళూరు, వైజాగ్, ఇండోర్, గౌహతి, కొలంబో షెడ్యూల్ చేశారు. ఒక సెమీ-ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. మరొకటి కొలంబో లేదా గౌహతిలో జరుగుతుంది. ఫైనల్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్‌లో జరిగే ఈ ట్రోర్నీలో పాకిస్తాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడుతుంది. 

Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

ఎనిమిది జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో మిగిలిన జట్లను ఒకే రౌండ్-రాబిన్ పద్ధతిలో ఎదుర్కొంటారు. మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెప్టెంబర్ 24 నుండి రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో కూడా అన్ని జట్లు పోటీపడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు