Air India Flight: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యాయి.

New Update
Air India Flight

Air India Flight

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పుడు విమాన ప్రయాణాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు తలెత్తాయి. సోమవారం చైనాలోని హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి వస్తోన్న ఎయిరిండయా విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. 

Also Read: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

Air India Flight Cancellations

దీంతో అలెర్ట్ అయిన పైలట్లు ముందుజాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. ప్రయాణికులందరినీ దింపేశాక అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు.  మంగళవారం కూడా ఎయిరిండియాకు సంబంధించి పలు విమాన సర్వీసులు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ- పారిస్, అహ్మదాబాద్‌-లండన్, లండన్-అమృత్‌సర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి -ముంబై వస్తున్న ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.

అలాగే జూన్ 18న పారిస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దయ్యింది. ముంబయి-అహ్మదాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా రద్దయ్యింది, ఢిల్లీ నుంచి రాంచీ వెళ్తున్న ఫ్లైట్ టేకాఫ్‌ అయిన కాసేపటికే వెనక్కి వచ్చేసింది. ఫుకేట్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానం కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపం దృష్ట్యా తమ సర్వీసులు రద్దు చేశామని.. ప్రయాణికులకు టికెట్స్‌ రిఫండ్ చేస్తామని ఎయిరిండియా ప్రకటించింది. గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యాయి. 

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు!

ఎయిరిండియాలో ఇలా వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశమవుతోంది. దీంతో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫయాజ్‌.. ఈరోజు ఎయిరిండియా అధికారులతో సమావేశం కానున్నారు. ఎయిరిండియాపై డీజీసీఏ కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు కూడా విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. అసలు ఎయిరిండియాకు ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం

 

telugu-news | gujarat | air india flight crash | air india boeing

Advertisment
Advertisment
తాజా కథనాలు