Mandi Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్‌డెడ్- మరో 25 మంది! (వీడియో)

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
himachal pradesh mandi bus accident 2 died

himachal pradesh mandi bus accident 2 died

Mandi Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి జిల్లాలో ఘోర బస్సు(Bus Accident) ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 9 గంటల ప్రాంతంలో జిల్లాలోని కల్ఖర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

mandi bus accident

Also Read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Also Read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

Advertisment
Advertisment
తాజా కథనాలు