/rtv/media/media_files/2025/06/17/1ypLydCP2MRl2Z4qmLo4.jpg)
daughter killed father in nizamabad district
అతడు చెడు వ్యసనాలకు బాగా బానిసయ్యాడు. రోజూ తన భార్యతో ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఆమెకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా ప్రాణం విసగ్గొడుతున్నాడు. ఇక తల్లిని రోజూ వేధిస్తుండటంతో కూతురు అల్లాడిపోయింది. ఎన్ని సార్లు చెప్పినా అతడు వినికపోవడంతో ఆగ్రహానికి గురైంది. చివరికి తన తండ్రిని కొట్టి కొట్టి చంపింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
Telangana Crime
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో పల్లపు నర్సయ్య(54), భార్య నర్సమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అందులో ఒకరు గంగామణి, మరొకరు మమత (30). వీరిద్దరికీ పెళ్లి అయిపోయింది. ఇద్దరూ నిజామాబాద్లోనే ఉంటున్నారు.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
తండ్రి నర్సయ్య గతంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. అలా హ్యాపీగా సాగిపోతుండగా.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పనులు మానేసి ఇంటి దగ్గరే ఖాలీగా కూర్చుంటున్నాడు. 15 రోజుల క్రితం నర్సయ్య తన భార్య నర్సమ్మను కొట్టాడు. దీంతో ఆమె కాలికి గాయమైంది. విషయం తెలిసి అదే జిల్లాలో ఉంటున్న గంగామణి తన తల్లిని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తన ఇంటికి తీసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
ఇక నర్సయ్య ఒక్కడే ఇంటి దగ్గర ఉంటున్నాడు. సోమవారం పుట్టింటికి వచ్చిన మరొక కూతురు మమత.. తన తండ్రితో మాట్లాడింది. అనంతరం తన తండ్రి పడుకోగానే.. అతడి తలపై రోకలిదుడ్డుతో గట్టిగా కొట్టింది. దీంతో నర్సయ్య స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఆపై ఆమె సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి