Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఎవరు ? భారత్‌తో వివాదం ఏంటీ ?

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.

New Update
Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు స్థావరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీతో ఆయన కుటుంబీకులను ఓ రహస్య బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) ఆయనకు భద్రత కల్పిస్తోంది. ఖమేనీని హత్య చేసేందుకు ఇజ్రాయెల్‌ ప్లాన్ వేసిందని అయితే దీన్ని ట్రంప్‌ వ్యతిరేకించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు అలీ ఖమేనీ ఎవరు ? ఆయన ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎలా ఎదిగారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.   

Also Read: ఇరాన్‌ను వేసేయండి...జీ7 దేశాల సంయుక్త ప్రకటన

అలీ ఖమేనీ ఎవరు ? 

ఖమేనీ 1939, ఏప్రిల్ 19న ఇరాన్‌లోని మష్షాద్‌లో జన్మించారు. ఆ తర్వాత తాను ఉంటున్న ప్రాంతంలో, అలాగే నజాఫ్‌లో మతపరమైన శిక్షణ పొందారు. అప్పట్లో ఇరాన్ రాజైన మొహమ్మద్ రెజా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా ఖమేనీ అండర్‌గ్రౌండ్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన అనేక సార్లు అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఇరాన్‌ నుంచి కొంతకాలం పాటు బహిష్కరణకు గురయ్యారు. అయితే 1979లో ఇరాన్ విప్లవం జరిగింది. దీని తర్వాత ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఖమేనీ.. విప్లవాత్మక నాయకత్వ హోదాల తర్వార ఎదుగుతూ వచ్చారు.    

1981లో ఖమేనీ టెహ్రాన్ మసీదులో ప్రసంగం ఇచ్చేటప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. మతాధికారుల వ్యతిరేక ఫోర్కాన్ బృందం ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి నుంచి ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆయన కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చేయి పక్షవాతానికి గురైంది. అయినప్పటికీ కూడా ఖమేనీ ఎదుగుతూ వచ్చారు. 1980 నుంచి 1988 వరకు ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగిన సంగతి తెలసిందే. ఈ సమయంలో సైనికులను సమన్వయం చేయడంలో ఖమేనీ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 

Also Read: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

1981లో అప్పడి ఇరాన్ అధ్యక్షుడు మహ్మాద్ అలీ రాజై, ప్రధాని మహ్మద్‌ జావెద్‌ బహోనార్‌ మృతి చెందారు. దీంతో ఖమేనీ ఆ సమయంలో 95 శాతం ఓటింగ్‌తో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1981 నుంచి 1989 వరకు రెండుసార్లు అధ్యక్షుడిగా సేవలందించారు.1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖోమెయినీ మృతి చెందారు. ఆ తర్వాత అదే ఏడాదిలో అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ మిలిటరీ, విదేశాంగ విధానం, అంతర్గత సెక్యూరిటీ అనేవి ఖమేనీ నియంత్రణలోనే ఉంటాయి. అలాగే కీలక మిలటరీ, ప్రభుత్వ అధికారులను నియమించడం, తొలగించడం లాంటివి కూడా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. 

Also Read :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్?

భారత్‌తో వివాదం

ఇటీవల అలీ ఖమేనీ భారత్‌తో ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రొపెట్ మహ్మద్‌ జయంతి సందర్భంగా ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేశారు. గాజా, మయన్మార్, ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లింలతో భారతీయ ముస్లింలను పోలుస్తూ ట్వీట్ చేశారు. '' మయన్మార్, గాజా, భారత్‌ లేదా ఇతర ప్రాంతాల్లో ముస్లింలు అనుభవిస్తున్న బాధను మనం విస్మరించినట్లయితే మనం ముస్లింలుగా పరిగణించబడలేము'' అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఇస్లాం శత్రువులు ముస్లింలను విడగొట్టి, ఇస్లాం ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇస్లాం ప్రపంచాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని కోరారు. 

ఆ తర్వాత ఖమేనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇరాన్ లాంటి దేశాలు ఇతర దేశాలపై కామెంట్లు చేసేముందు వారి దేశంలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని సూచించింది. భారత్‌.. మైనార్టీలతో పాటు దేశ ప్రజలందరికీ భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.  

Also Read :  పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టులు క్లోజ్‌... భయాందోళనలో వేలాదిమంది

telugu-news | israel iran war | ayatollah-ali-khamenei | Iran Supreme Leader

Advertisment
Advertisment
తాజా కథనాలు