/rtv/media/media_files/2025/06/17/LMyXhEQsDOU2pSylNqL7.jpg)
UAE-based Indian doctor donates Rs. 6 crore to medics families
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ ప్రమాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఊహించని ఘోరం జరిగిపోయింది.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
Air India plane crash
ఇది సాంకేతిక లోపంతో మేఘనా నగర్లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టింది. దీంతో చుట్టూ అగ్నిగోళంగా మారింది. ప్రమాదం మరింత ఉదృతమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, బిజె మెడికల్ కాలేజీ వైద్యులు సహా చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న వారు మంటల్లో కాలిబూడిదయ్యారు.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓ వైపు దట్టమైన నల్లటి పొగ.. మరోవైపు మంటల్లో కాలిబూడిదవుతున్న ప్రయాణికుల అరుపులతో ఆ ప్రాంతమంతా భయందోళనకు గురైంది. ఈ విషాద సంఘటనలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఎయిర్ ఇండియా విమానం పేలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది.
Also read: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
అయితే ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. టాటా గ్రూప్ సంస్థ స్పందించి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు కూడా వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని పేర్కొంది. అవసరమైన వాళ్లందరికీ సహకారం అందించి అండగా ఉంటామని స్పష్టం చేసింది. ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి కూడా సహకారం అందిస్తామని తెలిపారు.
ఇప్పుడు ఓ వైద్యుడు తన మంచి మనసు చాటుకున్నారు. యూఏఈలో నివాసం ఉంటున్న భారత వైద్యుడు డా. షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.