/rtv/media/media_files/2025/06/17/phQDpr14XieMtLu2zZnG.jpg)
china Supplies weapons to iran during present conflict
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. ఇప్పటికే రెండు కార్గో విమానాల్లో మిలటరీ సామాగ్రీని తరలించింది. మరోవైపు ఇరాన్ ఇతర విమానాలకు గగనతలాన్ని ముసివేసింది. చైనా నుంచి వచ్చిన కార్గో విమానాలకు మాత్రం సిగ్నల్స్ అందించింది. ఆ విమానాలు ల్యాండ్ అయిన తర్వాత మళ్లీ సిగ్నల్స్ను నిలిపివేసింది.
Also Read: షాకింగ్ న్యూస్.. అహ్మదాబాద్ TO లండన్.. డేంజర్లో మరో Air India Flight
Israel-Iran War
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పేల్చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా పెద్ద స్కెచ్ వేస్తున్నాయి. టెహ్రాన్ను వీడాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టెహ్రాన్ గగనతలాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. ఇరాన్లోని అణు కేంద్రాలను ఇజ్రాయెల్, అమెరికా టార్గెట్ చేశాయి. నతాంజ్, ఫార్దో అణు కేంద్రాలను పేల్చేయాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
Also Read: ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన
ఫార్దో అణు కేంద్రంలో ఇప్పటికే 60 శాతానికి పైగా యురేనియం శుద్ధి అయినట్లు సమాచారం. ఓ పర్వతం లోపల సొరంగాల్లో ఫార్దో అణుకేంద్ర నిర్మాణం ఉంది. అయితే అమెరికా వద్ద భూగర్భంలో నిర్మించిన వాటిని కూడా పేల్చేసే బాంబులు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా అమెరికా వద్దే GBU-57 బంకర్ బస్టర్ బాంబు ఉంది. మరోవైపు ట్రంప్ వాషింగ్టన్లో సిట్యూవేషన్ రూమ్కు వెల్లారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన తాను చేయడం లేదని అన్నారు. ఇక G7 దేశాలు కూడా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచాయి. ఇరాన్ కాల్పులు ఆపాలంటూ హెచ్చరించాయి. ఇరాన్ వద్ద అణు బాంబులు ఉండొద్దని కోరాయి.
Also Read: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్తో వివాదం ఏంటీ ?
Also Read : హైదరాబాద్లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
telugu-news | rtv-news | israel iran war