Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్‌ ట్రైన్‌లో మంటలు

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు. 

New Update
Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out

APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ట్రైన్‌లో మంటలు వ్యాపించాయి. తిరుపతి-సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్‌ బైండింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోయారు. 

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

సత్యసాయి జిల్లా తప్పిన ప్రమాదం

వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెనుక ఉన్న గార్డు గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ ట్రైన్‌ను నిలిపివేశారు. అనంతరం వెనుక బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీని కారణంగా ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు