/rtv/media/media_files/2025/06/17/rjrQWWYuQbVfpYtTeE0I.jpg)
thalliki vandanam scheme money
ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇటీవల అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ.. ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున సాయం అందజేసింది. ప్రభుత్వం ఇక్కడ రూ. 15వేలలో రూ.2వేలు కట్ చేసి రూ.13వేలు మాత్రమే ఇచ్చింది. ఆ కట్ చేసిన డబ్బును పాఠశాలలు/జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత/పారిశుధ్యం, పాఠశాల విద్యా శాఖ రూపొందించే SOP ప్రకారం ఇతర అంశాలకు ఉపయోగించనున్నారు.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
thalliki vandanam scheme
అయితే ఈ డబ్బులు అందిన కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరిశాయి. ఈ తరుణంలో మరికొంత మందికి ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమకాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు ఎందుకు పడలేదు? అని వారు కంగారు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 20 (జూన్ 20) వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
జూన్ 28లోపు అందిన ఫిర్యాదులను వెరిఫై చేసి అదనపు జాబితా తయారు చేసి వాటిని సచివాలయాల్లో పొందుపరచనున్నట్లు పేర్కొంది. జూన్ 30న గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల కొత్త జాబితాను ప్రదర్శి్ంచనున్నట్లు తెలిపింది. అనంతరం జులై 5న వారి అకౌంట్లలోకి ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొంది. అందువల్ల ఇప్పటి వరకు డబ్బులు జమకాని వారు ఉంటే.. దానికి గల కారణాన్ని సచివాలయాల్లో తెలుసుకుని వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇది కూడా చదవండి: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!
అయితే సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉంటే.. కాస్త ఆలస్యం అయినా డబ్బులు కచ్చితంగా పడతాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకుండా అన్ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉన్నవారు.. డబ్బులు పడకపోవడానికి గల కారణం ఏంటి? అనేది తెలుసుకుని ఆ సమస్యను క్లియర్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి