/rtv/media/media_files/2025/06/17/sL7opGIeS7ew9S0QpARB.jpg)
Iranian anchor Sahar
Israel Iran Conflict: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో సోమవారం, ఇరాన్ రాష్ట్ర మీడియా సంస్థ IRIB (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్) పై ఇజ్రాయెల్ దాడి( israel iran attack )కి సంబంధించిన భయంకరమైన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో కనిపించిన యాంకర్ సహర్ ఎమామి ఇప్పుడు ఇరాన్లో ప్రతిఘటనకు చిహ్నంగా మారారు. ఇరాన్లోని ప్రజలు ఈ వీడియో(israel iran war footage)ను విరివిగా షేర్ చేస్తున్నారు. ఆమెను ప్రతిఘటన స్వరంగా అభివర్ణిస్తున్నారు.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
యాంకర్ సహర్ ఎమామి న్యూస్ చదువుతున్న సమయంలోనే ఇరాన్ జాతీయ టీవీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆ సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ దాడిలో కొంతమంది మరణించినట్లు కూడా నివేదికలు వస్తున్నాయి. అయితే దాన్ని ఎవరూ దృవీకరించలేదు. అయితే, దాడి జరిగిన కొద్దిసేపటికే, యాంకర్ సహార్ ఇమామి లైవ్ బులెటిన్ చేయడానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇరాన్ మీడియా, యాంకర్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ.. ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శిస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలిపింది. దీని తరువాత, ఒక పేలుడు సంభవించింది, ఆ తర్వాత స్టూడియోలో ఏదో పడిపోవడం కనిపించింది. కొన్ని క్షణాల్లోనే, సహార్ ఎమామి ప్రత్యక్ష ప్రసారం నుండి నిష్క్రమించడం కనిపించింది. కాగా ఈ దాడిని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ధృవీకరించారు.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
కానీ కొన్ని గంటల తర్వాత IRIB తన ప్రసారాన్ని తిరిగి ప్రారంభించింది. మరోసారి సహార్ ఎమామి బులెటిన్ చేయడానికి తెరపైకి వచ్చింది. మళ్ళీ తెరపై కనిపించినప్పుడు, సహర్ ఎమామి చాలా స్పష్టంగా, దృఢంగా మాట్లాడారు. "ఏమి జరిగిందో చూశారు కదా ఇజ్రాయెల్ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి చేసిన తీరని ప్రయత్నం" అని ఆమె అన్నారు. "వార్తా నెట్వర్క్ భవనంపై దాడి జరిగితే, సత్యం యొక్క స్వరం అణచివేయబడదు." మేము మా పనిని కొనసాగిస్తాము. జాతీయ మీడియా బలంగా ప్రసారం చేస్తూనే ఉంటుందని ఆమె ఇజ్రాయెల్ను సవాలు చేసింది. ఇజ్రాయెల్ దాడులతో నిరాశకు గురైన, విలవిలలాడిన ఇరాన్ ప్రజలపై సహార్ వ్యాఖ్యలు అద్భుతంగా పనిచేశాయి. ఇరాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యాంకర్ ధైర్యాన్ని ప్రశంసించారు.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
సహార్ ఎమామి కథ
1985లో టెహ్రాన్లో జన్మించిన సహర్ ఎమామి, వ్యవసాయ ఇంజనీరింగ్లో డిగ్రీ చదివారు, ఆహార శాస్త్రంలోనూ అనుభవం కలిగి ఉన్నారు. ఆమె 2008లో టెహ్రాన్ స్థానిక ఛానెల్లో తన కెరీర్ను ప్రారంభించింది.2010లో IRINN రాజకీయ బృందంలో చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆమె "బ్యాక్ హోమ్", "మార్నింగ్ విత్ ది న్యూస్" వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. కానీ "న్యూస్స్టాండ్" అనే కార్యక్రమం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె మాటతీరు, తెలివితేటలు, సమస్యలపై పట్టు సహర్ ఎమామిని ప్రైమ్ టైమ్లో ఇష్టమైన యాంకర్గా మార్చాయి.
చాలా కాలంగా తన ప్రేక్షకుల నమ్మకాన్ని సంపాదించుకున్న సహర్ బాంబుదాడి ఘటన ఆమెను జాతీయ చిహ్నంగా మార్చింది.అప్పటివరకు భయంతో కూడిన ఇరానియన్లను సహార్ ఎమామి మాటలు క్షణంలో ధిక్కారంగా మార్చాయి. "దాడులు భవనాలను కదిలించగలవు, కానీ అవి సత్యాన్ని కదిలించలేవు' అన్న ఆమె మాటలు నేడు వందలాది ఇరానియన్ల గుండెల్లో బలంగా నాటుకున్నాయి.
ఇది కూడా చదవండి: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!