YCP Vs TDP: సత్తెనపల్లిలో హైటెన్షన్.. జగన్ పర్యటన ఉంటుందా? ఉండదా?

రేపు జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పొదిలి ఘటన నేపథ్యంలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పర్యటన చేసి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.

New Update
AP Palnadu Police

AP Palnadu Police

రేపు సత్తెనపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పల్నాడు పోలీసులు జగన్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన చేసి తీరుతాం అంటూ తేల్చి చెబుతున్నారు. ఇటీవల జగన్ చేపట్టిన పొదిలి పర్యటన లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు చెబుతున్నారు.

Also Read :  48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

Also Read :  కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!

ఈ నేపథ్యంలో సత్తెనపల్లికి వస్తే మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. భారీ జన సమీకరణ చేయడం ద్వారా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఎస్పీ ఇప్పటికే వెల్లడించారు. పరిమిత సంఖ్యలో రెంటపాల వెళ్తామని.. పోలీసులకు ఇప్పటికే వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.

Also Read :  హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!

ఇంకా తేల్చని పోలీసులు..

జగన్ పర్యటన అనుమతిపై పోలీసులు ఇంకా తేల్చకపోవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ ఆ గ్రామానికి రానున్నారు. 

Also Read :  ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన చైనా

 

YS Jagan | telugu breaking news | ycp-vs-tdp | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | andhra-pradesh-politics

Advertisment
Advertisment
తాజా కథనాలు