/rtv/media/media_files/2025/06/17/2G2BsXhdWxKRb9fXV6Ni.jpg)
AP Palnadu Police
రేపు సత్తెనపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పల్నాడు పోలీసులు జగన్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన చేసి తీరుతాం అంటూ తేల్చి చెబుతున్నారు. ఇటీవల జగన్ చేపట్టిన పొదిలి పర్యటన లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read : 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
17.06.2025
— YSR Congress Party (@YSRCParty) June 17, 2025
తాడేపల్లి
రేపు (18.06.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన
ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం…
Also Read : కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!
ఈ నేపథ్యంలో సత్తెనపల్లికి వస్తే మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. భారీ జన సమీకరణ చేయడం ద్వారా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఎస్పీ ఇప్పటికే వెల్లడించారు. పరిమిత సంఖ్యలో రెంటపాల వెళ్తామని.. పోలీసులకు ఇప్పటికే వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.
పల్నాడులో జగన్ గారి పర్యటనకు ప్రతి ఒక్క వైఎస్సాఆర్సీపీ కార్యకర్త కదిలి తరలిరండి!
— Kasu Mahesh Reddy (@iamkasumahesh) June 17, 2025
రేపు ఉదయం 10:00 గంటలకు సత్తెనపల్లిలో ఉంటాడు మీ కాసు మహేష్ రెడ్డి.#YSJagan #YSRCPSOCIALMEDIA #YSRCongressParty pic.twitter.com/HaxizFqCEN
Also Read : హైదరాబాద్లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
ఇంకా తేల్చని పోలీసులు..
జగన్ పర్యటన అనుమతిపై పోలీసులు ఇంకా తేల్చకపోవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ ఆ గ్రామానికి రానున్నారు.
Also Read : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన చైనా
YS Jagan | telugu breaking news | ycp-vs-tdp | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | andhra-pradesh-politics