Israel Iran Conflict: పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్టులు క్లోజ్‌... భయాందోళనలో వేలాదిమంది

ఇజ్రాయెల్‌ ఇరాన్‌ యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు దేశాలు తమ గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో తన గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది.

New Update
Airports: ఎయిర్‌పోర్టులే లేని ఐదు దేశాలు..అక్కడికి మరి ఎలా వెళ్తారు..?

Israel Iran Conflict

ఇజ్రాయెల్‌ ఇరాన్‌ యుద్ధం (Israel iran war) తారాస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు దేశాలు తమ గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ భారీ క్షిపణులతో దాడులు చేస్తుండంటంతో ఇరాన్‌ తన గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది. మరోవైపు పక్కనే ఉన్న లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. దీనికి తోడు పశ్చిమాసియాలోని పలు దేశాలు కూడా తమ గగన తలాలపై ఆంక్షలు విధించడంతో  పలు ఎయిర్‌ పోర్టులు మూతపడ్డాయి. ఒక్కసారిగా విమానశ్రయాలు మూతపడడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణీకులు అక్కడే చిక్కుకుపోయారు.

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Israel Iran Conflict

ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాల్లోని విమానశ్రయాల్లో పదివేలమందికి పైగా ప్రయణీకులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గగన తలాలను మూసివేయడంతో వీరంతా భూ మార్గంలోనే వారివారి దేశాలకు చేరుకోవలసి ఉంటుంది. శుక్రవారం ఇరాన్ టెహ్రాన్ శివార్లలో ఉన్న ప్రధాన ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. శనివారం ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు పాల్పడింది. దీంతో ఆ విమానశ్రయాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. 

Also Read: భారీ మంటల్లోంచి వస్తున్న రమేశ్ విశ్వాస్‌ కుమార్.. బయటపడ్డ మరో సంచలన వీడియో

ఇక ఇరాన్ దాడులు చేయచ్చన్న ముందస్తు సమాచారంతో ఇజ్రాయెల్‌ కూడా తమ దేశంలోని ప్రధాన విమానశ్రయాలను మూసివేసింది.  ముఖ్యంగా ఆదేశంలోని అత్యంత కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. ఈ మూసివేత వల్ల ఇజ్రాయెల్‌కు చెందిన 50వేల మందికి పైగా ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇరాన్‌ నిరంతరం దాడులు చేస్తుండడంతో దేశంలోని మూడు విమానయాన సంస్థల విమానాలను లార్నాకాకు తరలించింది. ఇక ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రజలు జోర్డాన్, ఈజిప్ట్‌తో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించవద్దని  ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రదేశాల్లో ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆక్కడ చిక్కుకు పోయిన వేలాదిమంది తమ దేశాలకు రావడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

Also Read: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్‌పై దాడులు !

Also Read :  ఫిట్‌గా ఉండాలనుకుంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు.. ప్రతిరోజూ ఇలా చేయండి!

 

israel iran war news

Advertisment
Advertisment
తాజా కథనాలు