🔴Live News Updates: AP - TG మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, రైలు నెంబర్లు ఇవే

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates

🔴Live News Updates: 

IPL 2025 Update: ఐపీఎల్ నుంచి మరో బిగ్ అప్డేట్.. ప్లేయర్లు లేకపోతే అలా చేయాల్సిందే

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్ మోగడంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

ఇక భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అనంతరం మళ్లీ ఐపీఎల్ రీస్టార్ట్ తేదీలను బీసీసీఐ అనౌన్స్ చేసింది. మే 17వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 6 ప్రాంతాల్లో మిగిలిన 17 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారత్‌, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 

Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

విదేశీ ప్లేయర్ల స్థానంలో

ఇప్పుడు మ్యాచ్‌‌లు రీస్టార్ట్ అవుతున్నా వారు తిరిగి ఇండియాకు రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్లేయర్లు తిరిగి ఇండియాకు వచ్చి ఐపీఎల్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. అందులో కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఉండిపోతుండగా.. మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో త్వరలో జరగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నారు. 

Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా IPL కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్‌లో కొత్త వారిని టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపింది. అయితే దానికీ కొన్ని కండీషన్లు పెట్టింది. ప్లేయర్ల రీ-ప్లేస్‌మెంట్‌లు తాత్కాలికమేనని చెప్పింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్‌కు రిటైన్‌ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. టెంపరరీగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు వచ్చే ఏడాది అంటే 2026 IPL మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు IPL Coo హేమంగ్ ఫ్రాంఛైజీలకు తెలిపారు. 

  • May 15, 2025 21:38 IST

    AP - TG మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, రైలు నెంబర్లు ఇవే

    ఏపీ, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. మే 17, 18 తేదీల్లో వీటిని నడపనున్నారు. 07441, 07442 ట్రైన్ నంబర్లతో ఇవి నడవనున్నాయి.

    Summer Special Trains
    Summer Special Trains Photograph: (Summer Special Trains)

     



  • May 15, 2025 20:25 IST

    మళ్లీ యుద్ధం! పాకిస్థాన్‌పై భారత్‌ దాడులు

    భారత్‌ పాకిస్థాన్‌పై తాజాగా 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • May 15, 2025 20:24 IST

    మరోసారి భారీ భూకంపం.. వణికిస్తున్న వీడియోలు

    టర్కీలోని కోన్యాలో గురువారం (మే 15) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్టేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటిస్తున్న అంకారాలో కూడా భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియోలు వైరలవుతున్నాయి.

    Turkey Earthquake
    Turkey Earthquake Photograph: (Turkey Earthquake)

     



  • May 15, 2025 19:07 IST

    నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. ట్రంప్ సంచలన ప్రకటన

    భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానన్నారు.

    Donald Trump
    Donald Trump

     

     

     



  • May 15, 2025 18:05 IST

    ఇట్స్ అఫీషియల్.. హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే

    హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలను పెంచారు. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 

    Hyderabad Metro Fare Hike



  • May 15, 2025 16:26 IST

    India-Pak War: ఇకపై 'స్పాటిఫై' లో ఆ పాటలు ఉండవు..!

    ప్రముఖ ఆడియో కంపెనీ స్పాటిఫై తమ ప్లాట్ ఫార్మ్ నుంచి పాకిస్థాన్ పాటలను తొలగించింది. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్ కి చెందిన ott కంటెంట్, చిత్రాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పాటిఫై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    spotify deleted Pakistan songs
    spotify deleted Pakistan songs

     



  • May 15, 2025 15:51 IST

    సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!

    రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు నిర్ణయించడంపై ద్రౌపది ముర్ము సంచలన లేఖ రాశారు. రాజ్యాంగంలో నిబంధన లేకపోయినా తమకు కాలపరిమితి ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. మొత్తం 14 అంశాలపై ముర్ము వివరణ కోరారు. 

    President Murmu
    President Murmu Photograph: (President Murmu)

     



  • May 15, 2025 15:48 IST

    ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష.. నరసరావుపేట కోర్టు సంచలన తీర్పు!

    నరసరావుపేట మహిళ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 

    Narasaraopet court accused sentenced to death in womans murder case
    Narasaraopet court accused sentenced to death in womans murder case Photograph: (Narasaraopet court accused sentenced to death in womans murder case)

     



  • May 15, 2025 15:38 IST

    పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!

    ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ అన్నారు. అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా అన్నారు.

    Top air warfare historian Tom Cooper calls India the clear winner
    Top air warfare historian Tom Cooper calls India the clear winner

     



  • May 15, 2025 15:37 IST

    షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!

    జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఎన్ కౌంటర్ కన్నా ముందు ఓ షెడ్లో ఉగ్రవాదులు దాక్కున్నారు. భద్రతా బలగాలు డ్రోన్ ద్వారా వారి కదలికలను గుర్తించి మట్టుబెట్టాయి.

    Read More



  • May 15, 2025 15:19 IST

    UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే

    2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్‌ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.

    UPSC Calendar 2026 Released
    UPSC Calendar 2026 Released Photograph: (UPSC Calendar 2026 Released)

     



  • May 15, 2025 14:30 IST

    పాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి సైబర్ అటాక్

    పాకిస్థాన్‌తో పాటు దాని మిత్రదేశాలు భారత్‌పై సైబర్‌ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్‌ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది.

    Cyber Attack
    Cyber Attack

     



  • May 15, 2025 14:06 IST

    BIG BREAKING: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

    ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. 

    Rajanath Singh
    Rajanath Singh

     



  • May 15, 2025 12:43 IST

    Same Sex Marriage UP: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

    యూపీలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అబ్బాయిలంటే ఇష్టం లేక ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు కోర్టు ప్రాంగణంలో ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కోర్టు ఒప్పుకోకపోయినా భార్యాభర్తలుగా కలిసి ఉంటామని తెలిపారు.

    UP girls married
    UP girls married

     



  • May 15, 2025 12:42 IST

    NARA LOKESH: అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-

    ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.



  • May 15, 2025 12:41 IST

    Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే

    మహేశ్‌బాబు.పి, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. "ఆంధ్రా కింగ్ తాలుకా"గా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ మూవీ టీం విడుదల చేసింది.

    Andhra King Taluka
    Andhra King Taluka

     



  • May 15, 2025 11:14 IST

    Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి అశ్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

    గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన  జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.

    Vallabhaneni Vamsi |
    Vallabhaneni Vamsi |

     



  • May 15, 2025 10:27 IST

    BIG BREAKING: గుజరాత్‌లో భారీ భూకంపం

    గుజరాత్‌ కచ్ జిల్లాలో బుధవారం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాయంత్రం 6.55 గంటలకు భచౌకు ఈశాన్యంగా 12 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని అధికారులు తెలిపారు.

    Earth Quake In Gujarat: భారత్‌లో భూకంపం



  • May 15, 2025 10:03 IST

    Bus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్‌ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

    Bus Fire Accident
    Bus Fire Accident

     



  • May 15, 2025 09:13 IST

    TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం

    తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.

     ttd



  • May 15, 2025 09:12 IST

    Manipur: మణిపూర్ లో కాల్పులు ..10 మంది మిలిటెంట్లు హతం

    మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో నిన్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

    manipur
    10 Militants Killed

     



  • May 15, 2025 08:36 IST

    AP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వీరికి అలెర్ట్

    ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    telangana weather report



  • May 15, 2025 08:06 IST

    MLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బిగ్‌ షాక్‌..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

    ఎప్పుడు వివాదాల్లో ఉండే హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయనపై  పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలో ఉండే మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

    MLA Padi Kaushik Reddy
    MLA Padi Kaushik Reddy

     



  • May 15, 2025 08:05 IST

    BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్

    భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది. 

    bla
    BLA Attack On Pak Army Canvoy

     



  • May 15, 2025 07:20 IST

    BIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

    మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

    BREAKING NEWS
    breaking news

     



  • May 15, 2025 07:19 IST

    BIG BREAKING: పుల్వామాలో ఎదురు కాల్పులు

    జమ్మూ, కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 

    Pakistan moving terrorists into bunkers after India zeroes in on launch pads, Sources
    Pakistan moving terrorists into bunkers after India zeroes in on launch pads, Sources

     



  • May 15, 2025 07:18 IST

    Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

    చైనా నుంచి పాకిస్తాన్ గొప్పగా తెచ్చుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలను కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని భారత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ అత్యంత ఆధునిక టెక్నాలజీని కలిగి ఉందని చెప్పింది. లాహోర్ లో ఒక రాడార్ పూర్తిగా నిలిపివేయబడిందని చెప్పారు. 

    ind
    Indian Army

     



Advertisment
Advertisment
తాజా కథనాలు