Manipur: మణిపూర్ లో కాల్పులు ..10 మంది మిలిటెంట్లు హతం

మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో నిన్న అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

New Update
manipur

10 Militants Killed

ఇండో-మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న చందేల్ జిల్లా, ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో ఇప్పటిదాకా పదిమంది మిలిటెంట్లు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఆపరేషన్ సమయంలో అనుమానిత క్యాడర్లు, దళాలపై కాల్పులు జరిపామని వివరించారు. మిలిటెంట్ల దగ్గర నుంచీ ఎక్కువ మొత్తంలో ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

 today-latest-news-in-telugu | manipur | militants | killed 

Also Read: CCPA: పాకిస్తాన్ జెండాలను అమ్ముతున్న కారణంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు