BIG BREAKING: పాకిస్థాన్‌పై భారత్‌ 15 మిసైల్స్‌తో దాడులు

ఆపరేషన్‌కు సిందూర్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్‌ పాకిస్థాన్‌పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడులు చేసినట్లు సమాచారం.

New Update
India Fired 15 Brahmos missiles on Pakistan

India Fired 15 Brahmos missiles on Pakistan

భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందే. అయితే ఆపరేషన్‌కు సిందూర్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్‌ పాకిస్థాన్‌పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ముందు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను సర్వే చేయడానికి డమ్మీ విమానాలను పంపినట్లు కూడా సమాచారం.  

Also Read: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన

పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీనికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. POK, పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ భారత్‌పైకి డ్రోన్లు, మిసైల్స్‌, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ భారత్‌ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అయితే మొత్తం 11 ఎయిర్‌బేస్‌లపై 15 బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ దాడులు చేసినట్లు తాజాగా బయటపడింది.  

ఇదిలాఉండగా.. ఆస్ట్రియన్ వార్‌ఫేర్‌ అనలిస్ట్‌ టామ్‌ కూపర్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ గ్రాండ్‌ సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఓ నేషనల్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: పబ్లిక్‌లో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని బీజేపీ నేత డ్యాన్స్.. వీడియో వైరల్!

" భారత్‌ దాడిలో పాకిస్థాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. అణు స్థావరాల ఎంట్రీ, ఎగ్జిట్‌లను భారత సైన్యం లేపేసింది. పాక్‌ వాళ్లు కూడా వాళ్ల అణు స్థావరాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఇండియా దెబ్బకు పాక్‌ గేమ్ఓవర్ అయ్యింది. వాళ్లు తమ అణు స్థావరాలు, ఎయిర్‌బేస్‌లను రక్షించుకోలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే భారత్‌ గెలిచినట్లే కదా'' అని టామ్ కూపర్ అన్నారు. 

operation Sindoor

Advertisment
Advertisment
తాజా కథనాలు