Vallabhaneni Vamsi Health Update: వల్లభనేని వంశీకి అస్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన  జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.

New Update
Vallabhaneni Vamsi |

Vallabhaneni Vamsi Health Update

Vallabhaneni Vamsi Health Update: గన్నవరం మాజీ ఎమ్మెల్యే(Gannavaram Ex MLA) వల్లభనేని వంశీని హుటాహుటిన  జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు.  ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు. రాత్రి నిద్రపోయే సమయంలో పల్స్‌ రేటు ఒక్కసారిగా తగ్గిపోతోందని తెలిపారు. వైద్యులు రాసిన మందులు కాకుండా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరఫు న్యాయవాది సత్యశ్రీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వంశీకి ప్రభుత్వాస్పత్రిలో గానీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రిలో గానీ వైద్యం చేయించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

Also Read: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు

జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై(Vallabhaneni Vamsi Health Condition) ఆరా తీస్తున్నారు.కాగా గన్నవరంకు చెందిన సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఇంకా జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేసింది. 

కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు వంశీని సాయంత్రం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొదటి అంతస్తులో ఉన్న రెసిడెంటల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చాంబర్‌లో వైద్యులు వంశీ రక్త నమూనాలను సేకరించారు. బీపీ, షుగర్‌, ఈసీజీ, సీటీ స్కాన్‌ పరీక్షలు చేశారు. ఆయనకు దగ్గు వస్తున్నట్లు గుర్తించారు.ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్‌ రాకపోవడంతో వంశీ జైలులోనే కొనసాగనున్నారు.

Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు