Cyber Attack: పాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి భారత్‌పై సైబర్ అటాక్

పాకిస్థాన్‌తో పాటు దాని మిత్రదేశాలు భారత్‌పై సైబర్‌ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్‌ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది.

New Update
Cyber Attack

Cyber Attack

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌తో పాటు దాని మిత్రదేశాలు భారత్‌పై సైబర్‌ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్‌ గ్రూపులు ఉన్నాయి. మరికొన్ని ప్రభుత్వానికి సంబంధం లేనివి ఉన్నాయి. 

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

Also Read :  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

Cyber Missiles

 పాకిస్థాన్‌, తుర్కియే, బంగ్లాదేశ్‌, మలేసియా, ఇండోనేసియా, ఇరాక్‌, చైనాకు సంబంధించినవి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇవి ముఖ్యంగా భారత్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, MSME వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టేషన్‌, పవర్‌గ్రిడ్‌ లాంటి వాటిని టార్గెట్‌ చేసుకున్నాయి. అలాగే BSNL, UPI, డిజిటల్ వాలెట్స్, స్టాక్‌ ఎక్స్‌ఛెంజీలు వంటి దిగ్గజ కంపెనీలను సైతం లక్ష్యంగా చేసుకున్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటాను దొంగిలించేందుకు యత్నించాయి. 

ఇలా జరగడంతో భారత డిజిటల్ ఆస్తులపై పాకిస్థాన్ చేసిన సైబర్‌ వార్‌గా ఇంటర్‌పోల్‌ ట్రెయిన్ పెండ్యాల కృష్ణశాస్త్రీ చెప్పినట్లు ఓ వార్త కథనం వచ్చింది. అంతేకాదు ఇటీవల ది సెంట్రల్ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్‌ సైబర్ దాడికి గురైంది. దాని సిస్టమ్‌లో మిస్టర్‌ హబిబ్‌ 404 పేరుమీద ఓ మెసేజ్‌ వచ్చింది. సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా.. మేము ఇక్కడే ఉన్నామనే ఓ మెసెజ్‌ కనిపించింది. దీంతో ఆ వెబ్‌సైట్‌ను రీస్టోర్ చేశారు. 

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

 ఇస్లామిక్‌ హ్యాకర్స్‌ ఆర్మీ , సైల్హెట్‌ గ్యాంగ్‌ ఎస్‌జీ, పాకిస్థాన్‌ సైబర్‌ ఫోర్స్‌, ఏపీటీ 36 వంటి హ్యాకింగ్‌ గ్రూపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పాక్‌ మిత్రదేశాలు చేసిన ఈ దాడులను భారత్‌ తిప్పికొట్టింది.

Also Read :  రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

telugu-news | national-news | cyber-attack | hacking 

Advertisment
Advertisment
తాజా కథనాలు