/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
ఏపీ, తెలంగాణ, యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా నేడు, రేపు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
Thunder storm rains telangana
— Warangal Weatherman (@tharun25_t) May 14, 2025
Finally now after a long gap of heat condition for North East Central TG got widespread thunderstorm rains moderate to light rains yesterday tonight till today early morning hours u can see map ⛈️ pic.twitter.com/EckzjTLgMY
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..
తెలంగాణ, ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో విశాఖపట్నం, శ్రీకాకుళం, కడప, తిరుపతి, అనంతపురం, యానాం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే పగటి సమయంలో కాకుండా రాత్రి పూట తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
ఇదిలా ఉండగా మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా వర్షాలు కురవడం మొదలవుతాయి. జులై 8 నాటికి ఈ రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. మళ్లీ నార్త్వెస్ట్ భారత్ నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అక్టోబర్ 15 నాటికి ఇది ముగుస్తుంది. అయితే ఈసారి జూన్ 1 కంటే ముందుగానే మే 27న నైరుతి రుతుపనవాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.