జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం ఆర్మీ ముమ్మర వేట కొనసాగిస్తోంది. తాజాగా పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. జేషే మహ్మద్ కు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్ ఈ ఎన్ కౌంటర్ లో హతమైనట్లు అధికారులు ప్రకటించారు. థ్రాల్ ఏరియాలో ఈ ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ వీరి కోసం జల్లెడ పట్టింది. నాదిర్ గ్రామంలో వీరు భద్రాత బలగాలను చూసి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు హతులయ్యారు.
Like the 3 slain JeM terrorists of Tral caught by drone cameras the Pahalgam butchers must also be in a safe house in J&K.
— Rahul Shivshankar (@RShivshankar) May 15, 2025
Shocking that there are still some who side with enemies of humanity. pic.twitter.com/6kgWQ921rr
పహల్గామ్ దాడిలో వీరి హస్తం ఉందా?
అయితే.. పహల్గామ్ ఉగ్రదాడిలో ఈ ముగ్గురు ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ కౌంటర్ కు ముందు ఉగ్రవాదుల కదలికలను అధికారులు డ్రోన్ ద్వారా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ షెడ్ లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఈ డ్రోన్ వీడియోలో స్పష్టం అవుతోంది. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతనే ఆర్మీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
నిన్న కూడా కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు మట్టుబెట్టాయి. షోపియాన్ ప్రాంతంలోని జిన్పాథర్ కెల్లర్లో జరిగిన ఎన్ కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
(telugu-news | telugu breaking news | india operation sindoor )