India-Pak War: ఇకపై 'స్పాటిఫై' లో ఆ పాటలు ఉండవు..!

ప్రముఖ ఆడియో కంపెనీ స్పాటిఫై తమ ప్లాట్ ఫార్మ్ నుంచి పాకిస్థాన్ పాటలను తొలగించింది. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్ కి చెందిన ott కంటెంట్, చిత్రాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పాటిఫై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
spotify deleted Pakistan songs

spotify deleted Pakistan songs

India-Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఈదాడి పాకిస్థాన్ సినీ పరిశ్రమపై కూడా ప్రభావం చూపింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కి చెందిన నటీనటులను, చిత్రాలను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల నుంచి  తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, చిత్రాలు, పాటలను  పూర్తిగా నిలిపివేయాలని  డిజిటల్ సంస్థలకు  ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్లాట్ ఫార్మ్స్ తమ సైట్స్ నుంచి   పాకిస్థాన్ కంటెంట్ తొలగించడం జరిగింది. 

Also Read :  కశ్మీర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. స్థానికులతో ముచ్చట్లు

Also Read :  IPL 2025: ఐపీఎల్‌ ఓనర్లకు బిగ్ రిలీఫ్‌..  నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!

పాక్ పాటలు తొలగింపు

ఈ నేపథ్యంలో తాజాగా  ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై  కూడా తమ ప్లాట్ ఫార్మ్ నుంచి పాకిస్థాన్ పాటలను తొలగించింది. ఫాస్లే, మాండ్, జోల్ చిత్రాలతో పాటు ఆదేశానికి చెందిన ఇతర పాటలను కూడా తీసేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు స్పాటిఫై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read :   IPL 2025: RCB ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్..

Also Read :  వామ్మో.. మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా కేసులు, మరణాలు!

telugu-news | cinema-news | telugu-cinema-news

Advertisment