TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం

తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.

New Update
ttd

ttd

TTDevasthanams : తిరుమలో రద్దీ కొనసాగుతోంది. వేసవికాలం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో  టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది. గతంలో 15 నుంచి 18 గంటలు పట్టే సర్వదర్శనం 6 నుంచి 10 గంటల్లోనే పూర్తవుతోంది. బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేయడం వల్ల రోజుకు ఏడువేల మందికి పైగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.  గత రెండురోజుల్లో చాలా ఈజీగా దర్శనం కలిగింది. మంగళవారం నాలుగు గంటల్లో, బుధవారం మూడు గంటల్లోనే దర్శనం లభించిందని టీటీడీ వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది  భక్తులు వస్తుంటారు. దీనికి తోడు  వేసవికాలం కావడంతో పాఠశాలల సెలువులతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. స్వామివారి దర్శనానికి ఏకంగా 18 గంటల నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీటీడీ సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుని వారికి త్వరగా దర్శనం పూర్తయ్యేలా ప్లాన్ చేసింది. దీంతో తిరుమల శ్రీవారి భక్తులకు ఇప్పుడు ఈజీగా దర్శనం లభిస్తోంది. గతంలో వేసవిలో దర్శనం కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు  టీటీడీ తీసుకున్న చర్యల వల్ల భక్తులకు త్వరగా దర్శనం కలుగుతోంది.. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేయడం, బ్రేక్ దర్శనం వేళలను మార్చడం వంటి చర్యలు కూడా దీనికి తోడయ్యాయి.   

ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

ఈ నెలలో భక్తల రాక సాధారణంగానే ఉందని టీటీడీ తెలిపింది. ఇప్పటివరకు 13 రోజుల్లో ఆరు రోజులు 70 వేల లోపే భక్తులు దర్శనం చేసుకున్నారు. మూడు రోజులు 70 వేల మందికి పైగా, నాలుగు రోజులు 80 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. సర్వదర్శనం 6 నుంచి 10 గంటల్లోనే పూర్తయింది.  

ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, 10.30 నుంచి 12.30 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే ఉదయం 8.30 నుంచి 10.30 గంటల మధ్య సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. ఈ రెండు గంటల్లో దాదాపు ఏడువేల మందికి పైగా సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. దీనివల్ల సర్వదర్శనం కొన్ని గంటల్లోనే పూర్తవుతోంది. మంగళవారం నాలుగు గంటల్లో, బుధవారం మూడు గంటల్లోనే దర్శనం లభించిందని టీటీడీ ప్రకటించింది.
 ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)

Advertisment
Advertisment
తాజా కథనాలు