/rtv/media/media_files/2025/06/14/vUINahb6S0Li9lVUB3tR.jpg)
air india flight manchu lakshmi travel mumbai to london
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రయాణికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నేటికి మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది మరణించగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది మెడికోలు మరణించారు.
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
ఎయిరిండియా ఫ్లైట్లో మంచు లక్ష్మి
ఈ తరుణంలో టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి షాకింగ్ పోస్టు చేసింది. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించానని తెలిపింది. ఆమె పోస్టు ప్రకారం.. ‘‘అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా బాధాకరమైనది.
Devastated by the tragic flight crash in Ahmedabad. So many innocent lives gone, it’s truly painful.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 12, 2025
My heart breaks as I hear about even more resident doctors who have lost their lives in this tragedy…
Can’t believe I just flew to London today on Air India God is Great.
This…
ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!
ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోతుంది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్పవాడు. ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది. బాధిత కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి.’’ అని తన పోస్టులో రాసుకొచ్చింది.
Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. పోస్టు వైరల్
— RTV (@RTVnewsnetwork) June 14, 2025
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర… pic.twitter.com/OJNWk8qji8
దీంతో సోషల్ మీడియా అంతటా ఆమె గురించే టాక్ నడిచింది. మంచు లక్ష్మికి ఏమైనా ప్రమాదం జరిగిందా? అని నెటిజన్లు, అభిమానులు ఆందోళనతో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని మంచు లక్ష్మి తెలిపింది. ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోను పంచుకుంది. విమాన ప్రమాదం జరిగిన రోజు తాను కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో లండన్కు ప్రయాణించానని తెలిపింది.
ఇది కూడా చదవండి: పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
అయితే తాను అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్కు వెళ్లానని పేర్కొంది. అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ప్రమాదం విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. తాను లండన్ చేరిన తర్వాత ఈ వార్త తనకు తెలిసిందని వెల్లడించింది. ప్రాణాలు క్షణంలో ఎలా ముగిసిపోతాయో ఇదొక ఉదాహరణ అని తెలిపింది.
Also Read : ముగిసిన మూడో రోజు ఆట..విజయం దిశగా సౌత్ ఆఫ్రికా
Ahmedabad Plane Crash | air india plane crash | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | national news in Telugu