/rtv/media/media_files/2025/06/14/zQwu3lBxf2hOrjAaYxX2.jpg)
Seat 11A Mystery
గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరింది. ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా మొదట ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడి ఉండరని అంతా భావించారు.
ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!
Ahmedabad Air Plane Crash
కానీ ఒకే ఒక్కడు బ్రిటిష్ పౌరుడు విశ్వస్కుమార్ రమేష్ ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడయ్యాడు. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే విమానంలో విశ్వస్కుమార్ కూర్చున్న సీటు నంబర్ 11A ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సీటు అతడి ప్రాణాలను కాపాడిందని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!
అయితే ఇలాంటి ఒక అద్భుతమైన యాదృచ్చికం మరొకటి వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల కిందట జరిగిన విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి 11A సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది.
Also Read : ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!
1998లో థాయిలాండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సూరత్ థానిలో ల్యాండ్ అవుతుండగా విమానం చిత్తడినేలలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 101 మంది మరణించగా.. 45 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అందులో రువాంగ్సాక్ జేమ్స్ లోయ్చుసాక్ కూడా ఒకరు. తాను కూడా 11A కూర్చుని ప్రాణాలతో బయటపడ్డానని రువాంగ్సాక్ ఫేస్బుక్ ద్వారా తెలిపాడు.
రువాంగ్సాక్ జేమ్స్ పోస్టు ప్రకారం.. ‘‘భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదంలో నా సీటు నంబర్ 11A లో కూర్చున్న ఏకైక ప్రయాణీకుడు ఉన్నాడు. నేను విమానం ప్రమాద సమయంలో 11A సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను. ఇప్పుడు అలాంటి ఘటనే విని నేను షాక్ అయ్యాను. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నేను ఎవ్వరితో మాట్లాడకుండా ఉండేవాడిని. తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. దాదాపు 10 సంవత్సరాలుగా విమాన ప్రయాణానికి భయపడ్డాను. చీకటి మేఘాలు, తుఫాను చూసినప్పుడు చాలా బాధపడేవాడిని. నరకంలో ఉన్నట్లు అనిపించేది.’’ అని రువాంగ్సాక్ తన ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఇక ఈ ప్రమాదం తర్వాత రుయాంగ్సాక్ జేమ్స్ థాయ్లో ప్రముఖ సింగర్గా మారాడు.