/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాంతంలో రంగస్వామి (47), అతని భార్య కవిత (44) దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కోడుకు సూర్య (23) ఉన్నాడు.
Also Read: విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య
అయితే రంగస్వామికి తాగుడు అలవాటు ఉంది. అలాగే గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం అతడి భార్యకు కూడా తెలిసింది. దీంతో రంగస్వామి ఇంట్లో తరచుగా తన భార్యతో గొడవలు జరుగుతుండేవి. జూన్ 9న రాత్రికి రంగస్వామి మిద్దెపై పడుకున్నాడు. అక్కడి వచ్చిన అతడి భార్య పెట్రోల్ పోసి నిప్పంటించింది.
Also Read: విమాన ప్రమాదం.. తల్లి కళ్ల ముందే కాలిపోయిన కన్నకొడుకు
ఇది గమనించిన కొడుకు సూర్య.. హుటాహుటీనా తండ్రిని చికిత్స కోసం క్రిష్ణగిరి ఆస్పత్రికి తరలించాడు. చికిత్స తీసుకుంటుండగానే రంగస్వామి బుధవారం రాత్రి మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా ఇటీవల మేఘాలయలో కూడా సోనమ్ అనే మహిళ తన భర్తతో హనీమూన్కు వచ్చి హత్య చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
Also Read: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్