Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. తల్లి కళ్ల ముందే కాలిపోయిన కన్నకొడుకు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న 16 ఏళ్ల ఆకాష్ మంటల్లో చిక్కుకుని మరణించాడు. ప్రమాదం సమయంలో అతని తల్లి సీతాబెన్ టీ చేస్తోంది. తన కొడుకు మంటలతో కాలిపోతుండటంతో అతన్ని కాపాడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.

New Update
Ahmedabad Plane Accident 16 year old boy burnt death at tea stall mother in critical condition

Ahmedabad Plane Accident 16 year old boy burnt death at tea stall mother in critical condition

జూన్ 12 గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఈ విషాద సంఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానం పేలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ఇది సాంకేతిక లోపంతో మేఘనా నగర్‌లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీ కొట్టింది. దీంతో చుట్టూ అగ్నిగోళంగా మారింది. 

ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

Ahmedabad Plane Accident

ఓ వైపు దట్టమైన నల్లటి పొగ.. మరోవైపు మంటల్లో కాలిబూడిదవుతున్న ప్రయాణికుల అరుపులతో ఆ ప్రాంతమంతా భయందోళనకు గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, బిజె మెడికల్ కాలేజీ వైద్యులు సహా చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్న వారు మంటల్లో కాలిపోయారు. అందులో మేఘనానిగర్‌లో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్న ఒక మహిళ కుమారుడు కూడా ప్రాణాలు వదిలాడు. 

ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!

అకస్మాతుగా మంటలు

ప్రమాదం జరిగిన రోజు సీతాబెన్ అనే మహిళ మేఘనానిగర్‌లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ పక్కనే టీ స్టాల్ నడుపుతోంది. సీతాబెన్ కుమారుడు 16 ఏళ్ల ఆకాష్ కూడా అప్పటికి టీ స్టాల్‌లోనే ఉన్నాడు. అది మధ్యాహ్నం కావడం, కస్టమర్లు లేకపోవడంతో ఆకాష్ పక్కనే ఉన్న చెట్టుకింద పడుకున్నాడు. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురై కూలిపోయిన వెంటనే పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. 

Also Read :  ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!

ఈ ప్రమాదంతో సమీపంలో ఉన్న షాపులన్నింటికీ మంటలు వ్యాపించాయి. టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న ఆకాష్ కూడా మంటల్లో చిక్కుకున్నాడు. భారీగా చెలరేగిన మంటల్లో అతడు కాలిపోయాడు. వెంటనే అతడి తల్లి సీతాబెన్ తన కొడుకును కాపాడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే సీతాబెన్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సీతాబెన్, ఆకాష్ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆకాష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆకాష్ తల్లి సీతాబెన్ మంటల్లో కాలిపోవడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు