Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్, గీతగోవిందం, బ్రోచేవారెవరూ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో పాపులర్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ఎక్స్ లో పంచుకున్నారు. ''దర్శకుడిగా నా తొలి సినిమా మొదలు పెట్టాను.. మీలో ఎవరికైనా నటించాలనే ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్, ఫొటోలను నా మెయిల్కు పంపించగలరు'' అని పోస్ట్ పెట్టారు.
Also Read: Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
My first directorial venture- adventure!
— Rahul Ramakrishna (@eyrahul) June 14, 2025
If interested, please mail your acting portfolios/resumes/showreels to the email ID mentioned in the picture.
:) #UrumiFilmsLLP pic.twitter.com/Q2XlBgkSb9
దర్శకుడిగా పరిచయం
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని, నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. రాహుల్ కెరీర్ లో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుంది. అయితే ఈ చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?
రాహుల్ రామకృష్ణ తన హాస్య నటనకు పేరుగాంచినప్పటికీ, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. 'ఇంటింటి రామాయణం' వంటి సినిమాల్లో మెయిన్ లీడ్ గా కూడా నటించారు రాహుల్. ఇప్పుడు దర్శకత్వం వైపు కూడా అడుగులు వేయడం ఆయన బహుముఖ ప్రజ్ఞను తెలియజేస్తుంది.
Also Read: Balayya Viral Video: బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్