/rtv/media/media_files/2025/06/14/lcFQjNcR7qn4SWevDf0i.jpg)
ఈ మధ్యకాలంలో అప్పు ఇచ్చిన వాడి కంటే అప్పు తీసుకున్న వాడి పనే బాగుంది. రుణగహితలకు అనుకూలంగా తమిళనాడు రాష్ట్రం ఓ చట్టం తీసుకొచ్చింది. బలవంతంగా అప్పు వసూలు చేసే బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ R.N. రవి ఆమోదం తెలిపారు. రుణసంస్థలు బెదిరించి అప్పులు వసూలు చేస్తే లేదా ఆస్తులు స్వాధీనం చేసుకుంటే 5 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. రుణగ్రహీత బలవన్మరణానికి కారణమైతే బెయిల్ లభించని విధంగా కేసు నమోదు అవుతుంది.
తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.
అదే విధంగా ఆ రాష్ట్రంలో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేస్తే విచారణ లేకుండా డెరెక్ట్ అరెస్ట్ చేసేలా ఓ చట్టం తీసుకొచ్చారు. మార్చి 24న శాసనసభలో మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం గవర్నర్కు పంపించడంతో ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
forced debt collection | tamil-nadu | punishment | tamilanadu Governor R.N. Ravi | new-law | new-laws | CM MK Stalin | latest-telugu-news