🔴LIVE BREAKINGS: చచ్చారు కొడుకులు.. పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు ఎన్‌కౌంటర్‌

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Hari Hara Veera Mallu: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ‘హరిహర వీరమల్లు’

పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ ధరలు తగ్గాయి. నేటి నుంచి టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175 కాగా.. మల్టీపెక్స్‌లలో రూ.295కే ‘హరిహర వీరమల్లు’ టికెట్లు లభిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (hari hara veera mallu) చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సంపాదించింది. కానీ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజుకు కలెక్షన్లు పడిపోయాయి. ఇందులో పవన్ కల్యాణ్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

Hari Hara VeeraMallu

అయితే ఇప్పటి వరకు ఈ మూవీ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సినిమాను చూడలేకపోతున్నారు. అలాంటి వారికోసం చిత్రబృందం అదిరిపోయే సర్ ప్రైజ్ అందించింది. జూలై 28వ తేదీ (ఇవాళ్టి నుంచి) నుంచి ‘హరి హర వీరమల్లు’ టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ యాప్‌లలో ఈ మూవీ టికెట్ రేట్లకు సంబంధించిన మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. 

ఇవాళ నుంచి ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా కేవలం సాధారణ ధరకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175 కాగా.. మల్టీపెక్స్‌లలో రూ.295కే ‘హరిహర వీరమల్లు’ టికెట్లు లభిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికి ఇంకా ఈ సినిమా చూడని వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

ఇది కూడా చూడండి: సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

  • Jul 28, 2025 15:26 IST

    Anasuya Bharadwaj: చెప్తే నమ్మేలా ఉండాలి.. ట్రోలర్లకు అడ్డంగా దొరికేసిందిగా..!

    టీవీ యాంకర్‌గా కరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో ఫుల్ బిజీగా మారింది. ఆమెను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న 3 మిలియన్ల మందిని బ్లాక్‌ చేశానని ఓ ఇంటర్వ్యూ లో చప్పుకొచ్చింది అయితే నెటిజన్లు ఆమెను ఇప్పుడు ఈ విషయంపై కూడా మళ్ళీ ట్రోల్‌ చేస్తున్నారు.

     

    Anasuya Bharadwaj
    Anasuya Bharadwaj

     



  • Jul 28, 2025 14:35 IST

    IND vs ENG: ఐదో టెస్ట్‌కు పంత్ స్థానంలో అతడే - బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కుద్ది

    రిషబ్ పంత్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే 5వ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ ఎన్. జగదీశన్‌ను జట్టులోకి తీసుకున్నారు. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. జగదీశన్‌కు ఇది తొలి టెస్టు పిలుపు.

     

    Narayan Jagadeesan Rishabh Pant replacement for the 5th Test against England
    Narayan Jagadeesan Rishabh Pant replacement for the 5th Test against England

     



  • Jul 28, 2025 13:43 IST

    చచ్చారు కొడుకులు.. పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు ఎన్‌కౌంటర్‌

    జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.



  • Jul 28, 2025 13:32 IST

    భక్తుల ప్రాణాలు తీస్తున్న పుకార్లు.. విషాదంగా మారుతున్న దైవదర్శనాలు

    వరుసగా 2 రోజు దేవాలయాల్లో తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. కరెంట్ షాక్ పుకారే ఈ ఘోర విషాదానికి కారణమని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

    Stampede



  • Jul 28, 2025 13:32 IST

    ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - బయటపడ్డ అక్రమ మోసం

    తమిళనాడులోని సేలంలో గబ్బిలాల వేట ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని చిల్లీ చికెన్‌గా హోటళ్లకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ చిల్లీ చికెన్ స్కామ్ ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు రేకెత్తించింది.

     

    Tamil Nadu Bat Hunting Gang (2)
    Tamil Nadu Bat Hunting Gang (2)

     



  • Jul 28, 2025 13:15 IST

    కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి టార్చర్.. యువకుడు ఆత్మ*హత్య!

    హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



  • Jul 28, 2025 12:17 IST

    కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

    ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను కూడా రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నూతన కార్డుదారులు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను పొందడంలో జాప్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    cm-revanth-reddy



  • Jul 28, 2025 12:16 IST

    అస్సలు ఊహించలేదు.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..

    సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు తిరుమలరావుకు తన ప్రియురాలు ఐశ్వర్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై నిఘా పెట్టేందుకు తిరుమలరావు ఆమె స్కూటీకి రహస్యంగా ట్రాకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.

     

    Surveyor Tejeshwar Case
    Surveyor Tejeshwar Case

     



  • Jul 28, 2025 12:15 IST

    అస్సలు ఊహించలేదు.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..

    పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోవడం, అలాగే స్త్రీలలో బలహీనమైన అండాలు ఉత్పత్తి, ఇతర అనారోగ్య కారణాల వల్ల సహజంగా ఫలదీకరణ జరగడం లేదు. దీంతో IVF సెంటర్ల చెబుతున్నది ఏంటి? చేసేది ఏంటో ఇప్పుడు చూద్ధాం..

    IVF centers scam



  • Jul 28, 2025 11:36 IST

    షటిల్ ఆడుతూనే గుండెపోటుతో..

    నాగోల్ షటిల్ స్టేడియంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో తోటి ఆటగాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తిని ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామానికి చెందిన గుండ్ల రాకేష్ గా గుర్తించారు. 

     

    nagole incident
    nagole incident

     

     



  • Jul 28, 2025 11:23 IST

    షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు

    జర్మనీలో జూలై 27 సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ జర్మనీలోని రీడ్లింగెన్ పట్టణం సమీపంలో ఓ ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.

     

    Germany Passenger train derails
    Germany Passenger train derails

     



  • Jul 28, 2025 10:54 IST

    ‘HHVM’ నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం అదే.. మొత్తం చెప్పేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

    ‘హరిహర వీరమల్లు’ నుంచి దర్శకుడు క్రిష్ ఎందుకు వైదొలిగారో జ్యోతికృష్ణ తెలిపారు. వరుసగా ఏడాదిపాటు బ్రేకులు పడ్డాయి. క్రిష్ చాలా వెయిట్ చేశారు. ఆయన ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు.

     

    director jyothi krishna special interview about hari hara veeramallu director krish
    director jyothi krishna special interview about hari hara veeramallu director krish

     



  • Jul 28, 2025 10:16 IST

    నలుగురు యువకులతో భార్య.. భర్తని ఏం చేసిందంటే?

    హైదరాబాద్‌ దుండిగల్‌లో భర్తని చంపేందుకు భార్య నలుగురు యువకులతో స్కెచ్‌ వేసింది. బాచుపల్లి రాజీవ్ గృహకల్పలో రాందాస్‌, ఆయన భార్య నివాసముంటున్నారు. గత వారం రాందాస్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. భార్యే చంపించాలునుకుందని రాందాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    wife plan to kill husband



  • Jul 28, 2025 09:16 IST

    ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..

    హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్​ వేశారన్నారు.

     

    Srishti Test Tube Baby Center Case Sensational facts
    Srishti Test Tube Baby Center Case Sensational facts

     



  • Jul 28, 2025 08:13 IST

    వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

    రేవంత్ సర్కార్ పెన్షన్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. అయితే వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం, మరణించిన వారి పేర్లపై ఇంకా పింఛన్లు అందుతున్న అనుమానాలు ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.

     

    Revanth Reddy
    Revanth Reddy

     



  • Jul 28, 2025 08:12 IST

    ఏపీలో దారుణం.. భార్యపై అనుమానం - పిల్లల ముందే రాయితో కొట్టి కొట్టి..!

    ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. పిల్లలు చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

     

    east godavari husband kills his wife over domestic dispute
    east godavari husband kills his wife over domestic dispute

     



  • Jul 28, 2025 07:29 IST

    మరో ఆలయంలో తొక్కిసలాట

    ఉత్తరప్రద్రేశ్‌లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించారు.



  • Jul 28, 2025 07:28 IST

    IND Vs ENG: ఇట్స్ అఫీషియల్.. టీమిండియాకు గట్టి దెబ్బ

    ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కాలి బొటనవేలికి తీవ్ర గాయమైంది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ నిర్ధారణ కావడంతో, ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. పంత్ స్థానంలో జగదీశన్‌ను సెలెక్ట్ చేశారు.

     

    rishabh pant ruled out of 5th test
    rishabh pant ruled out of 5th test

     

     



  • Jul 28, 2025 07:26 IST

    సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ‘హరిహర వీరమల్లు’

    పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ ధరలు తగ్గాయి. నేటి నుంచి టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175 కాగా.. మల్టీపెక్స్‌లలో రూ.295కే ‘హరిహర వీరమల్లు’ టికెట్లు లభిస్తున్నాయి.

     

    Hari Hara Veera Mallu Super Hit became this is Main reasons
    Hari Hara Veera Mallu Super Hit became this is Main reasons

     



Advertisment
తాజా కథనాలు