/rtv/media/media_files/2025/07/28/germany-passenger-train-derails-2025-07-28-11-03-43.jpg)
Germany Passenger train derails
జర్మనీలో ఆదివారం (జూలై 27) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ జర్మనీలోని రీడ్లింగెన్ పట్టణం సమీపంలో ఓ ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సిగ్మరింగెన్ నుండి ఉల్మ్ నగరానికి వెళ్తున్న ఈ రైలులో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
సహాయక చర్యలు:
ఆదివారం సాయంత్రం 6:10 గంటల ప్రాంతంలో రీడ్లింగెన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. నలుగురు మరణించగా, సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
🇩🇪 Four people have been killed and several others injured after a passenger train derailed near #Riedlingen, southwest Germany.#Germany#Europe#Train#Derailpic.twitter.com/eORyHCOClW
— TheWarPolitics 🇮🇳 (@TheWarPolitics0) July 28, 2025
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని.. దీనివల్ల కొండచరియలు విరిగిపడటం లేదా ఇతర వాతావరణ సంబంధిత కారణాలు ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
🚨 Train derailment in Germany: 3 dead, 50+ injured
— NEXTA (@nexta_tv) July 28, 2025
A passenger train went off the rails — likely due to a landslide.
A storm may have washed out the embankment just before the crash.
📰 Schwäbische Zeitung reports: the front car derailed left, and carriages flew 5 meters up a… pic.twitter.com/dFTV6TTDOB
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక దళాలు, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైల్వే అధికారులు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదం జర్మనీలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.
Several people were killed and injured after a passenger train derailed in the Biberach district of Baden-Württemberg, Germany .
— GeoTechWar (@geotechwar) July 27, 2025
A mass casualty event has been declared, and rescue operations are underway . #Zugunglückpic.twitter.com/CICNe1Sv9Z
train-accident | Latest crime news | crime news