Surveyor Tejeshwar Case: అస్సలు ఊహించలేదు.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..

సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు తిరుమలరావుకు తన ప్రియురాలు ఐశ్వర్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై నిఘా పెట్టేందుకు తిరుమలరావు ఆమె స్కూటీకి రహస్యంగా ట్రాకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Surveyor Tejeshwar Case

Surveyor Tejeshwar Case

గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్యలకు కోర్టు తాజాగా రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని.. విచారించగా సంచలన విషయాలు బయటపెట్టారు. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరుమలరావు.. తన ప్రియురాలు ఐశ్వర్యపై తీవ్ర అనుమానంతో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య కదలికలపై నిఘా పెట్టేందుకు తిరుమలరావు ఆమె స్కూటీకి రహస్యంగా ట్రాకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. 

దీంతో ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుంది అనే విషయాలను తెలుసుకునేవాడని.. ఈ ట్రాకర్ ద్వారానే ఐశ్వర్య.. తేజేశ్వర్‌ను కలుస్తోందని నిర్ధారించుకున్న తిరుమలరావు.. ఆ తర్వాత తేజేశ్వర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కొత్త అంశాలు కేసు దర్యాప్తులో కీలక మలుపు తిప్పుతున్నాయి. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

Advertisment
తాజా కథనాలు