Bengaluru: నటుడు దర్శన్‌ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ!

బెంగళూరులో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు ఇప్పుడు ఒక వింత సమస్య పట్టుకుంది. ఆల్రెడీ జైల్లో నానా పాట్లు పడుతున్న అతన్ని ఇప్పుడు కొత్తగా రేణుకాస్వామి ఆత్మ పట్టుకుని పీడిస్తోందిట. 

Haryana: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 90 స్థానాల్లో 55కు పైగా కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. 

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న అమిత్‌ షా సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు.

Modi: ముంబై మెట్రోలో మోదీ!

ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్‌ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు.

J&K: జమ్మూ–కాశ్మీర్ లో మళ్ళీ హంగేనా?

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఎన్నికలు అయిపోయాయి. అక్టోబర్ 8 ఫలితాలు విడుదల అవనున్నాయి. అయితే నేషనల్ మీడియా ఈ రోజు ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేశాయి. ఇందులో జమ్మూ–కాశ్మీర్‌‌లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. 

Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్‌ కౌంటర్

నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌‌ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్‌లో చదవండి..

Kerala: అయ్యప్ప దర్శనం..రోజుకి 80 వేల మందికి మాత్రమే!

ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు సీఎంఓ ప్రకటించింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Web Stories
web-story-logo prabhs_V_jpg--816x480-4g వెబ్ స్టోరీస్

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీస్ ఇవే!

web-story-logo GZG3tn5XEAAvTNj వెబ్ స్టోరీస్

'దేవర' తో పాటూ ఫస్ట్ వీక్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే!

web-story-logo Nabha Natesh y వెబ్ స్టోరీస్

కళ్ళజోడు నభా .. కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఫోజులు

web-story-logo cake71 వెబ్ స్టోరీస్

కేక్‌ తింటే క్యాన్సర్‌ వస్తుందా?

web-story-logo garlic10 వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

web-story-logo Tollgate10 వెబ్ స్టోరీస్

ప్రపంచంలో ఏ దేశాల్లో టోల్‌ట్యాక్స్‌ ఉండదు..?

web-story-logo yuty వెబ్ స్టోరీస్

'దేవర' పార్ట్-2 కోసం దాచి ఉంచిన ప్రశ్నలివే!

web-story-logo VGGJFGJ వెబ్ స్టోరీస్

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

web-story-logo alia w వెబ్ స్టోరీస్

అలియా ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ వచ్చేసింది

web-story-logo Mamitha Baiju3 వెబ్ స్టోరీస్

ప్రేమలో పడేస్తున్న 'ప్రేమలు' బ్యూటీ

Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 6‌00 మంది ఊచకోత

ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బైక్‌ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు. 

Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

కమలా హారిస్‌ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్‌ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్‌ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌ కీలక నేత అల్‌ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం

ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు.

పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు..

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Picaso Painting: ఈ పెయింటింగ్‌ ఖరీదు..రూ.55 కోట్లు!

ఇటలీలోని ఓ జంక్‌ డీలర్‌.. కాప్రిలో ఉన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్‌ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోగా..అది పికాసో గీసిన చిత్రమని...దాని ఖరీదు రూ.55 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.

మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి 14మందితో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా సెర్ఫ్‌ సీఈవోను నియమించింది.

మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్‌

TG: మూసీ నిర్వాసితుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్‌ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు సీఎం రేవంత్.

హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

TG: హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.

Telangana: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

హరీష్ రావు, కేటీఆర్‌.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా?: జగ్గారెడ్డి

TG: రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అంటూ కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు జగ్గారెడ్డి. రుణమాఫీ కోసం ఆగస్టులో రూ.18 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇంకో రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ ఆగిందని చెప్పారు.

BIG BREAKING: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం

TG: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు!

తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు.

తిరుమల ప్రసాదంలో జెర్రీ.. టీటీడీ కీలక ప్రకటన!

AP: భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వేడి పెరుగు అన్నంలో ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య అని పేర్కొంది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని కోరింది.

BREAKING: సీఎం చంద్రబాబు సీరియస్!

AP: సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

BIG BREAKING: తిరుమల ప్రసాదంలో జెర్రీ!

AP: తిరుమలలో టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. దీనిపై టీటీడీ అధికారులను భక్తులు ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్!

AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్‌ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ‌ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది.

తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.

భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు

టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.

ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి..

చిత్తూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం బెట్టింగ్ లో రూ.30 లక్షలు కోల్పోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో మరొక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..!

రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి.

అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్‌లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు.

సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్‌ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!

టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.

బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు

అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు.

Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్‌పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి.

లావా అగ్ని3 5G లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవు..!

టెక్ బ్రాండ్ లావా తాజాగా తన లైనప్‌లో ఉన్న అగ్ని3 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని డ్యూయల్ అమోలెడ్ డిస్‌ప్లేలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 9 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్!

బజాజ్ ఆటో తన పల్సర్ బైక్‌లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్‌ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price