డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్!

AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్‌ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ‌ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

YSRCP: లడ్డూ కల్తీపై సిట్ వస్తుంది సమాధానం చెప్పు అంటూ టీడీపీ పెట్టిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్‌ పాలిటిక్సే అని విమర్శలు గుప్పించింది. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయ‌న‌ పద్ధతి ఇదే అని ఆరోపించింది. వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు అని టీడీపీ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసింది. "మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు... కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు." అని ప్రశ్నలు సంధించింది.

వైసీపీ విసిరిన ప్రశ్నలు..

1.లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ? 
2.కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?
3.ఈవో ఒకమాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం… పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?
4.ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?
5.జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు. 
6.అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా? 
7.శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?

Advertisment
Advertisment
తాజా కథనాలు