/rtv/media/media_files/2025/04/17/yaPpD3JbfxogoToAiuPY.jpg)
Pakistan army chief Asim Munir
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పలికింది. అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అగ్రరాజ్యం నుంచి ఆహ్వానం అందిది. ఈ నెల 12వ తేదీన వాషింగ్టన్ చేరుకోనున్న జనరల్ అసిమ్ మునీర్.. జూన్ 14వ తేదీన జరిగే వేడుకలకు హాజరు కానున్నారు.
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు
Also Read : ఫోన్పై, గూగుల్ పే ఆన్లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!
పెద్ద స్కెచ్ వేసిన అగ్రరాజ్యం..
అయితే ఈ విషయం ఇప్పుడు విపరీతమైన చర్చలకు దారి తీస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ప్లాన్ ఏంటి. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ ఎందుకు దాయాది దేశాన్ని నెత్తి మీద పెట్టుకుంటోంది. అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను పిలవడం వెనుక ఏంటి ఉద్దేశం...ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. భారత్ కే మా సపోర్ట్ అని మొన్నటి వరకు చెప్పిన యూఎస్ ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద స్కేచ్చే వేసిందని చెబుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకే మునీర్ ను అమెరికా రప్పిస్తున్నారని అంటున్నారు. అతనితో ఈ విషయం గురించి మాట్లాడి, ఒత్తిడి తేవాలని అనుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో పాటూ చైనా, పాక్ మధ్య పరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తోంది. లిథియం, రాగి, బంగారం వంటి అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో పాకిస్తాన్ విదేశీ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందని చెబుతున్నారు.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
Also Read: Cinema: హీరో నిఖిల్ సినిమాలో భారీ ప్రమాదం
usa | pakistan | today-latest-news-in-telugu | Asim Munir | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu