Talliki Vandanam: నేడే అకౌంట్లోకి రూ.15వేలు.. డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే?

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ.8745 కోట్లు జమ చేయనున్నారు.

New Update
Talliki Vandanam

Talliki Vandanam

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా ఒక్కో విద్యార్థికి తమ తల్లులు ఖాతాలో రూ.15వేలు పడనున్నాయి. కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. 

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా మొత్తం 67,27,164 మంది స్టూడెంట్స్‌కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ. 8745 కోట్లు జమ చేయనున్నారు. 

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

అర్హులెవరు?

1వ తరగతి విద్యార్థి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి వరకు కూడా ఈ పథకానికి అర్హులు. దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేయనుంది. ఈ స్కీమ్ కింద 12వ తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రతి ఏడాది రూ.15,000 ఇస్తారు. 

Also Read :  టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

డబ్బులు పడాలంటే?

ఈకైవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి.

ఎన్పీసీఐతో లింక్ చేయబడి ఉండాలి. 

ఇవన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తల్లుల అకౌంట్లో డబ్బులు జమవుతాయి. 

Also Read :  తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

 

cm chandrababu | talliki-vandanam | talliki vandanam scheme budget | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
తాజా కథనాలు