/rtv/media/media_files/2025/06/12/BFWmLsWs7I6nweaD6bQ2.jpg)
Honeymoon Murder Case
భారతీయులకు మంగళసూతం చాలా ముఖ్యమైనది. దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లో పెళ్ళయిన పదహారు రోజుల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తీయరు. కానీ హత్యకు పక్కా ప్లాన్ వేసిన సోనమ్ మాత్రం దాన్ని మర్చిపోయింది. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించడానికి ముందు ఆమె తన మంగళసూత్రాన్ని, వెడ్డింగ్ రింగ్ ను హోటల్ రూమ్ లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని మేఘాలయా పోలీసులు గుర్తించారు. దీంతో కొత్తగా పెళ్ళైన మహిళ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తరువాత రాజా రఘవంశీని చంపించడమే కాక..స్వయంగానే తానే లోయలోకి తోసేసింది సోనమ్. ఆ తరువాత ఓ నిందితుడి స్కూటీపైనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
Also Read : ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్
Also Read : లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ట్రంప్ కుర్చీకి ఇవి ఎసరు పెట్టనున్నాయా?
నిందితులకు 8 రోజుల కస్టడీ..
ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీతో సహా ఐదుగురుని షిల్లాండ్ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. నిందితులకు 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సోనమ్ భర్త, మృతుడు రాజా రఘువంశీపై శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావించారు. ఆ తర్వాత సోనమ్ కోసం గాలించగా.. ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపుర్లో తేలింది.
రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండౌర్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. అయితే మే 11న రాజాకు సోమన్తో పెళ్లి జరిగింది. 20న ఈ నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 11 రోజుల తర్వాత రాజా మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో గుర్తించారు.
Also Read: LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్
Also Read : చెంచల్గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్
\today-latest-news-in-telugu | Meghalaya Honeymoon Murder Case | Sonam | today-news-in-telugu | latest-telugu-news | telugu-news | telugu crime news