LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్

లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.

New Update
la

Curfew Imposed In Los Angeles

లాస్ ఏంజెలెస్ ఆరో రోజు కూడా మండుతూనే ఉంది. నగరంలో కర్ఫ్యూ విధించారు.  నిరసనలను అడ్డుపెట్టుకుని కొంతమంది దోపిడీదారులు యాపిల్, అడిడాస్ లాంటి షోరూంలను దోచుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి నగరంలో కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు రబ్బరు బులెట్లను ఉపయోగించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళన కారులు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అల్లర్లు చేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా 197 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 

Also Read :  చెంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్

Also Read :  గోపిచంద్‌ బర్త్‌డే స్పెషల్‌.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

Also Read :  టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

నగరం అంతా సైనికులతో నిండిపోయింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్ కూడా లాస్ ఏంజెలెస్ కు చేరుకున్నారు. ఎలా అయినా నగరంలో అల్లర్లను అణిచే తీరుతానని అధ్యక్షుడు పట్టుబట్టుకుని కూర్చున్నారు. అక్రమవలసదారులను, వారిని సపోర్ట్ చేస్తున్నవారిని ఉపేక్షించేదే లేదని చెప్పారు. మరోవైపు సైనికులతో నగరాన్ని నింపేస్తున్నారని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మండిపడుతున్నారు. అక్రమ వలసదారుల పేరుతో సామాన్య జనాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. నేరస్థులను అరెస్ట్ చేస్తే పర్వాలేదు కానీ మామూలు జనాలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. 

Also Read :  తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

 

usa | los-angeles | today-latest-news-in-telugu | america president donald trump | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు