/rtv/media/media_files/2025/06/09/cbMbGUkAD3UkyUbEuePn.jpg)
DK Shiva Kumar
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట ఘటన పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో11 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై మరోసారి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని పేర్కొన్నారు.
Also Read: బీజేపీతో మాకు సంబంధం శాశ్వతంగా ఉంటుంది.. చంద్రబాబు సంచలన ప్రకటన
Bengaluru Stampede
ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో మీటింగ్ పూర్తయిన తర్వాత డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ''తొక్కిసలాట ఘటన నుంచి కర్ణాటక ఎన్నో పాఠాలను నేర్చుకుంది. ఇకనుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు సరైన ప్రణాళికలు రూపొందిస్తాం. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామని'' డీకే శివకుమార్ తెలిపారు.
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
ఇదిలాఉండగా ఇటీవల చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరగడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. 11 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంత హడావుడిగా విజయోత్సవ వేడుక నిర్వహంచాల్సిన అవసరం ఏంటని కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనతో సంబంధం ఉన్న ఈవెంట్ మెనేజ్ సంస్థ, ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.
Also Read: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్ - షాకింగ్ వీడియో
Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విరూపాక్ష డైరెక్టర్.. ఘనంగా ఎంగేజ్మెంట్ ! ఫొటోలు వైరల్
telugu-news | dk-shiva-kumar | RCB Stampede