/rtv/media/media_files/2025/06/12/vfb0HQyPiDJbxZwh9qu4.jpg)
Talliki Vandanam 2000 deducted
ఏపీ సర్కార్ సూపర్ సిక్స్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకం నిధుల్ని రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు దాదాపు రూ.8,745 కోట్లు జమ చేయనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ.. ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున సాయం అందజేయనుంది.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
తల్లికి వందనం
అయితే ప్రభుత్వం ఇక్కడ రూ. 15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించిన గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. అందులో ఈ విషయం గురించి తెలిపింది. దాని ప్రకారం.. ఈ స్కీమ్ ద్వారా ఇస్తున్న రూ.15వేల నుంచి రూ.2వేలు కట్ చేయనుంది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం!
ప్రతి విద్యార్థికి ఇస్తున్న మొత్తంలో రూ.2,000 తగ్గించి రాష్ట్రంలో విద్యాపర్యావరణ వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఉపయోగించనున్నారు. ఇక తగ్గించిన రూ.2,000 జిల్లా కలెక్టర్ నియంత్రణలో ఉన్న సంబంధిత అకౌంట్కు జమ చేస్తారు. ఈ నిధుల వినియోగం.. పాఠశాలలు/జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత/పారిశుధ్యం, పాఠశాల విద్యా శాఖ రూపొందించే SOP ప్రకారం ఇతర అంశాలకు ఉపయోగించనుంది.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
/rtv/media/media_files/2025/06/12/0Lwc2NryFBsCAbDI9JyK.jpeg)
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు