/rtv/media/media_files/2025/06/12/LZzyOsDBrqwfyqL2sQdh.jpg)
2021 సంవత్సరం అందరి జీవితాల్లో విషాదం నింపింది. కోవిడ్ 19 మహమ్మారి సృష్టించిన బీభత్సాన్ని అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. అదే ఏడాదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇటీవల ప్రచురించబడిన UN జనాభా నివేదికలో ఈ విషయం బయటపడింది. ఇది కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కల విభాగం పౌర రిజిస్ట్రేషన్ వ్యవస్థ డేటా నుంచి తీసుకున్నారు. కోవిడ్ 19 రెండవ దశలోనే సిరిసిల్ల జిల్లాలో భారీగా జనాభా తగ్గిందని తేలింది. కోవిడ్ తర్వాత మరణాల రేటు పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి రిపోర్ట్లో తేలింది.
ఇండియాలోని 49 జిల్లాల్లో 2021 జననాల రేటు కంటే మరణాలు రేటు ఎక్కవగా ఉందట. CRS 2021 డేటా ప్రకారం.. సిరిసిల్లాలో జిల్లాలో 5,028 జననాలు నమోదవ్వగా.. 5,130 మంది చనిపోయారు. 2021లో రాష్ట్రంలో మొత్తం 2,34,425 మరణాలు నమోదయ్యాయి. వీరిలో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. మహిళల కంటే దాదాపు 40% ఎక్కువ మంది పురుషులు మరణించారు. 65–69 సంవత్సరాల వయస్సు గల వారు అత్యధికంగా మరణించారని డేటాలో ఉంది. ఈ వయసు వారు 85,945 మంది చనిపోయారు. 70 ఏళ్లు పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి.
తెలంగాణలో మధ్యస్థ వయసు వారు కోవిడ్ రెండవ దశలో ఎక్కువగా చనిపోయారు. 55–64 సంవత్సరాలలో, 42,349 మరణాలు, 45–54 సంవత్సరాలలో 22,423 మరణాలు, 35–44 సంవత్సరాలలో 12,184 మరణాలు సంభవించాయి. వృత్తిపరమైన ఒత్తిడి, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు వంటివి కూడా ఈ అకాల మరణాలకు దోహదపడ్డాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.