/rtv/media/media_files/2025/06/12/VdF2cWNDqBx6cS1h0srm.jpg)
producer k mahendra passed away
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్న డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్ చౌదరీ మృతి చెందిన ఘటన మరవకముందే.. మరో నిర్మాత మరణించారు. సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి గుంటూర్ లోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈరోజు గుంటూర్ లో 12.30pm కి ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
సినిమాలు
నిర్మాత మహేంద్ర టాలీవుడ్ లో 50కి పైగా సినిమాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఎ.ఎ ఆర్ట్స్ బ్యానరల పై ఎక్కువ సినిమాలను నిర్మించారు. ఎ.ఎ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు. అలాగే డైరెక్టర్ గోపీచంద్ ని కూడా పరిచయం చేసింది ఆయనే. మహేంద్ర.. నటుడు, నిర్మాత డాక్టర్ మాదాల రవికి స్వయనా మామగారు అవుతారని సమాచారం.
Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం!
telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu