Telangana: తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక

తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్‌, వాసా రాఘవేందర్‌ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.

New Update
telangana road accident three young man died at rangareddy district

telangana road accident three young man died at rangareddy district

తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. పొద్దంతా ఎంతో జాలీగా, సరదా సరదాగా గడిపిన వారంతా రాత్రికే మృతి చెందడం కన్నీరు పెట్టిస్తోంది. అది కూడా బర్త్ డే పార్టీ నాడే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయిన ముగ్గురూ పాతికేళ్లలోపు వయసున్నవారే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

పుట్టిన రోజు నాడే విషాదం

వాసా సాయితేజ, వాసా పవన్‌కుమార్‌, వాసా రాఘవేందర్‌, వాసా శివకుమార్, ఇ.సాయికుమార్‌ వరసకు అన్నదమ్ములు. వీరిది మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామం. వీరికి మరో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వారు ఎం.సందీప్, శివకుమార్‌. వీరిద్దరు మూసాపేటలో నివాసం ఉంటున్నారు. 

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

వీరంతా హైదరాబాద్‌లో ఉంటూ వేరు వేరు పనులు చేసుకుంటున్నారు. వీరిలో వాసా శివకుమార్ బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. దీంతో నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్‌ కాలనీలోని కృష్ణా బ్యాక్‌వాటర్‌ వద్దకు వెళ్లి పొద్దంతా బాగా ఎంజాయ్ చేశారు. రాత్రి వరకు అక్కడే ఉండి సరదాగా గడిపారు. డ్యాన్స్‌లు వేస్తూ, గోలలు చేశారు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి చేరుకునేందుకు పయణమయ్యారు. 

Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

అలా కారుపై వస్తుండగా.. రాత్రి 2 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్‌ పట్టణం దాటిన కొద్దిసేపటికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో వాసా సాయితేజ(23), వాసా పవన్‌కుమార్‌(25), వాసా రాఘవేందర్‌(24) స్పాట్‌లోని మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: స్పేస్‌ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా

 

mahabubanagar | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
తాజా కథనాలు