🔴Ind-Pak War Live Updates: కశ్మీర్‌పై మళ్లీ పాక్ డ్రోన్స్ : లైవ్

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది.

author-image
By Lok Prakash
New Update
Ind-Pak War Live Updates

Ind-Pak War Live Updates

🔴Ind-Pak War Live Updates: 

BIG BREAKING: పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడికి ప్రయత్నం.. ఎక్కడంటే..?

జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్(Pakistan Drone Attack) చేసింది. భారత్(Indian Army) పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ మరో సారి ఉల్లంఘనకు పాల్పడింది. మా జోలికి వస్తే వైమానికి దాడులు చేస్తామని చేసి చూపించినా పాక్ తన వక్ర బుద్ధిని మరవలేకపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. గగనతలంలోనే పాకిస్తాన్‌ డ్రోన్లను కుప్పకూల్చింది ఇండియ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బ్లాక్‌అవుట్ అమలు చేసి డ్రోన్లను కూల్చివేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణపై ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ మాత్రం తురుచూ కాల్పలు, డ్రోన్ అటాక్‌లకు పాల్పడుతుంది. అదే రోజు ఒప్పందాన్ని గాలికి వదిలేసి భారత్‌పై కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ సాంబా సెక్టార్‌ ప్రాంతంలో బ్లాక్‌‌అవుట్‌ ప్రకటించింది. పాకిస్తాన్ డ్రోన్ డాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడటం ఇది రెండోసారి. పాక్ వంకర బుద్ధికి భారత్ ధీటుగానే సమాధానం చెబుతోంది. 

  • May 13, 2025 21:13 IST

    పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి రెహమాన్‌పై భారత్‌ వేటు

    రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా ప్రకటన
    24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశం
    పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్న రెహమాన్
    రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచర్యం
    భారత సైన్యం సమాచారాన్ని ISIకి చేరవేస్తున్న రెహమాన్
    డానిష్‌ మారుపేరుతో ISI కోసం పనిచేస్తున్న రెహమాన్



  • May 13, 2025 20:54 IST

    పాకిస్థాన్‌ బిగ్‌ షాక్.. వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం

    భారత్‌లో ఉంటున్న పాక్ దౌత్య అధికారులను వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ వద్ద పనిచేస్తున్న పాక్ దౌత్య అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

    India asked a Pakistani embassy official to leave India with immediate effect on charges of espionage
    India asked a Pakistani embassy official to leave India with immediate effect on charges of espionage

     



  • May 13, 2025 19:53 IST

    Operation Sindoor: పురాణాల్లో సింధూరం వెనుక ఉన్న రహస్యం ఇదే!!

    పెళ్లైన స్త్రీలు భర్త ఆయుష్యుకు చిహ్నంగా సింధూరం ధరిస్తారు. పురాణాల్లో శివుడికి ఇష్టమని పార్వతీ, రాముడి కోసం సీత, హనుమంతుడు సింధూరాన్ని ధరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భార్యల కళ్ల ముందే భర్త చంపి వారి నుదిట సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఆపరేషన్ సిందూర్.

    Sindhoor history



  • May 13, 2025 17:44 IST

    లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు..

    మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్‌ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హమీద్ వెంట ఆయన బావ, సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం.

    Abdul Hamid
    Abdul Hamid

     



  • May 13, 2025 17:43 IST

    పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

    భారత్ వైమానికి దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌, రన్ వేలు ధ్వంసమైయ్యాయి. క్లియర్ శాటిలైట్ ఇమేజ్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్గోధా, హీమ్ యార్ ఖాన్, లాహోర్‌లో IAF విధ్వంసం సృష్టించింది. పాక్ ఎయిర్ బేస్‌లను ఇండియా దుగ్గు దుగ్గు చేసింది.

    Rahimyar Khan Airbase

     



  • May 13, 2025 16:05 IST

    PM Modi: వీరులారా వందనం.. ప్రధాని మోదీ ఎమోషనల్ స్పీచ్

    పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. 

    Narendra Modi With Army



  • May 13, 2025 16:00 IST

    భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి సెల్యూట్..

    ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారు.. ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ వెంట ఉన్నాయి.. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.. ఆపరేషన్‌ సిందూర్‌ సాధారణమైన సైనిక విన్యాసం కాదు.. ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం-ప్రధాని మోడీ



  • May 13, 2025 16:00 IST

    ప్రధాని నరేంద్ర మోడీ

    భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది.. భవిష్యత్‌ కాలానికి మీరు ప్రేరణగా నిలుస్తారు-ప్రధాని నరేంద్ర మోడీ



  • May 13, 2025 15:59 IST

    👉 పంజాబ్‌ ఆదంపూర్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి వాయుసేనను  ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

    👉 భారత్‌ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం: ప్రధాని మోదీ

    👉 యుద్ధం రంగంలో సైనికులు భారత్‌ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుడుతుంది

    👉 మన సైనికులు చరిత్ర సృష్టించారు



  • May 13, 2025 15:58 IST

    మన సైన్యం సామర్థ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

    👉 భారత శక్తి సామర్థ్యాలను చూసి నా జీవితం ధన్యమైంది

    👉 దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు

    👉 ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ సైన్యం శపథం చేసింది



  • May 13, 2025 15:58 IST

    👉 అక్క, చెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం: ప్రధాని మోదీ

    👉 గురిచూసి కొట్టిన దెబ్బతో శత్రుస్థావరాలు మట్టిలో కలిశాయి

    👉 పాక్‌ సైనికులకు నిద్రలేని పరిస్థితి తెచ్చాం

    👉 పాక్‌లో ఏ స్థావరాన్నైనా గురిచూసి కొట్టగలమని నిరూపించాం

    👉 మన రక్షణ వ్యవస్థతో పాక్‌ దాడులను నిర్వీర్యం చేశాం



  • May 13, 2025 15:42 IST

    మన సైన్యం సామర్థ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

    👉 భారత శక్తి సామర్థ్యాలను చూసి నా జీవితం ధన్యమైంది

    👉 దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు

    👉 ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ సైన్యం శపథం చేసింది



  • May 13, 2025 14:24 IST

    PM Modi: ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..

    ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. దీన్నిబట్టి ఆయన శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

    PM Modi
    PM Modi

     

     

     

     



  • May 13, 2025 13:54 IST

    Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!

    షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి చెందాడు.  మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు  భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.

    jammui-encounter
    jammui-encounter

     



  • May 13, 2025 13:53 IST

    PM Modi: ఎయిర్ బేస్‌‌ను సందర్శించిన ప్రధాని.. వైమానిక దళానికి మోదీ ప్రశంసలు

    ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ఫోర్స్‌తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్‌లో అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

    modi punjab



  • May 13, 2025 12:47 IST

    BIG BREAKING: పాక్‌ పై అణు బాంబ్ ఎఫెక్ట్‌.. గ్రామాలు ఖాళీ!

    భారత్‌ ఆర్మీ ఎటాక్‌ చేసిన సర్గోదా ఎయిర్‌ బేస్‌ సమీపంలో కిరానాహిల్స్ ఉన్నాయి. ఈ కిరానాహిల్స్‌లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచి ఉంచిందని తెలుస్తోంది. భారత్‌ దాడి నేపథ్యంలో అణు వాయువులు లీక్‌ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

    b0daea4e-8599-4c26-becf-d52f29fde734



  • May 13, 2025 12:10 IST

    రక్షణ శాఖ అధికారులతో మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ!



  • May 13, 2025 11:53 IST

    BIG BREAKING: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!

    భారత్ జరిపిన ప్రతీకార చర్యలో తమ సైనికులు11 మంది మృతి చెందగా 78 మంది గాయాలయ్యాని పాక్ ఆర్మీ వెల్లడించింది. అంతేకాకుండా మరో 40 మంది పౌరులు మృతి చెందారని, 121 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

    Pakistani Military personne



  • May 13, 2025 11:26 IST

    BIG BREAKING : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..లష్కరే తోయిబా ఉగ్రవాది హతం

    షోపియన్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి చెందాడు.  మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు  భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.

    jammui-encounter
    jammui-encounter

     



  • May 13, 2025 11:02 IST

    Asim Munir : ఎట్టకేలకు బయటకు వచ్చిన అసిమ్‌ మునీర్‌- VIDEO

    భారత్, పాక్ దేశాల మధ్య కాల్పులు విరమణ తరువాత మళ్లీ అసిమ్‌ మునీర్‌ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను కలుస్తున్నారు. ఎల్‌ఓసి వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.

    Asim Munir
    Asim Munir

     



  • May 13, 2025 10:42 IST

    Pakistan: పాక్ అణ్వాయుధాలపై దాడి జరిగితే.. ఏమవుతుందో తెలుసా?

    పాకిస్తాన్‌ కిరానా హిల్స్‌‌లో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై బ్రహ్మోస్ వంటి క్షిపణులతో దాడులు చేసినా అణు బాంబు విస్ఫోటనం చెందదు. దీని చూట్టూ ఉన్న ప్రాంతానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. బలమైన కాంక్రీట్‌ మధ్యలో నిల్వ చేయడం వల్ల విస్ఫోటనం చెందవట.

    Kirana Hills in Pakistan
    Kirana Hills in Pakistan

     



  • May 13, 2025 08:01 IST

    Pakistan Attack : ఘోరం.. పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి

    భారత్ పై కోపంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరుపుతున్న పాక్ అన్యం పుణ్యం ఎరుగని ఇద్దరు కవలపిల్లలను పొట్టనబెట్టుకుంది. జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఈనెల 7న పాక్ ఆర్మీ జరిపిన మోర్టార్ షెల్లింగ్ లో  12 ఏళ్ల జోయా, అయాన్ ఖాన్ మరణించారు.

    jammu-twines
    jammu-twines

     



  • May 13, 2025 06:52 IST

    BIG BREAKING: పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడికి ప్రయత్నం.. ఎక్కడంటే..?

    జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది.

    J& K samba



  • May 13, 2025 06:52 IST

    PAKISTAN: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

    పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. పాకిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రిజర్వ్‌ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్‌ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్‌ నిల్వ చేసినట్లు సమాచారం.

    Kirana Hills



  • May 13, 2025 06:51 IST

    PM Modi: ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్‌ను ఏం చేయబోతున్నాడంటే..?

    ప్రధాని మోదీ ఉగ్రరూపం దాల్చారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేశాకే పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధమని మోదీ అన్నారు. ఇదివరకెన్నడూలేని విధంగా పాక్‌పై కోపంతో ప్రధాని మీడియా ముందుకు వచ్చారు. 

    Modi pressmeet



Advertisment
Advertisment
తాజా కథనాలు